నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి.ఎన్నికల ముందు ఏపీ ప్రధాన విపక్షం వైసీపీకి అందివచ్చిన అవకాశం అసెంబ్లీ సమావేశాలు.
దాదాపు 10 రోజుల్లోనే ఇవి ముగియనున్నాయి.ఈ సభలకు హాజరై వైసీపీ ప్రజా సమస్యలు… అధికారపార్టీ అవినీతి తదితర అంశాలను లేవనెత్తి దడ దడలాడించాలి.
ఎన్నికల ముందు జరుగుతున్న ఈ సభలకు హాజరయ్యి దడ దడలాడించాల్సిన ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా నిరసన తెలుపుతోంది.
అయితే ఇక్కడ వైసీపీ తప్పు చేస్తుందా అనే అనుమానం అందరికి కలుగుతోంది.అయితే నాలుగున్నరేళ్ళ కాలంలో పట్టుమని పది రోజులు కూడా ప్రజల మధ్య లేని పవన్ కళ్యాణ్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదు? అఖిలపక్ష సమావేశానికి ఎందుకు రావడం లేదు అని జగన్ ప్రశ్నిస్తున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇందులో తప్పు ఎవరిది.? ఎవరి వల్ల ప్రత్యేక హోదా అంశం మరుగున పడిపోయింది అనే వివరాలు కూడా ఒక సారి పరిశీలించాలి.హోదా ఇస్తాను అని చెప్పి మాట తప్పింది బీజేపీ.
ఆ పార్టీతో నాలుగేళ్లు స్నేహం చేసిన టీడీపీ కూడా ఆ సమయంలో ఆ ఊసే ఎత్తలేదు.
కానీ బీజేపీ తో స్నేహం చెడిపోయిన తరువాత టీడీపీ హోదా అంశాన్ని తలకెత్తుకుంది.
బీజేపీ మోసం చేసింది అంటూ… గట్టిగా గొంతు పెంచింది.వాస్తవంగా చూస్తే… ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ దూకుడుగా ముందుకు వెళ్లి పోరాడింది.
అనేక ఆందోళనలు చేసింది.ఇక్కడే కాదు ఢిల్లీలో కూడా వైసీపీ దీక్షలు… ధర్నాలు చేసి కేంద్రానికి తమ నిరసన తెలిపింది.
ఇక కోడెల శివప్రసాద్ స్పీకర్గా ఎలా వ్యవహరిస్తున్నారో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించిన కోడెలకు వైకాపా నుంచి టిడిపిలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల రాజీనామాలు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న విషయం తెలియదా? ఫిరాయింపు ఎమ్మెల్యేలను, వైసీపీ ఎమ్మెల్యేలుగానే ఉన్నవాళ్ళకు టిడిపి తరపున మంత్రులను చేయడం కంటే దారుణం వేరే ఉంటుందా? అలాంటి అన్యాయాలు చోటు చేసుకుంటున్న అసెంబ్లీకి విలువ ఉందా…విలువల్లేని అలాంటి రాజకీయాలు చేయలేను అని జగన్ చెప్తే అది తప్పవుతుందా ? అంటూ వైసీపీ నేతలు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు.అందుకే తాము అసెబ్లీ సమావేశాలకు వెళ్లడం లేదు అంటూ.వైసీపీ ఎమ్యెల్యేలు సమర్ధించుకుంటున్నారు.