గోపీచంద్ హీరోగా పరిచయం అయ్యి సక్సెస్ కాలేక పోయాడు.ఆ తర్వాత విలన్గా తన సత్తా చాటి మళ్లీ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
హీరోగా ఇప్పటి వరకు 24 చిత్రాలు చేసిన గోపీచంద్ తాజాగా 25వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.ఏ హీరోకు అయినా 25వ చిత్రం అంటే చాలా ప్రతిష్టాత్మకం.
ఈ తరం హీరోల్లో 25 చిత్రాలు చేసే హీరోలు అంటే చాలా గొప్ప.ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం పది పదిహేను చిత్రాలు చేసి ఫేడ్ ఔట్ అవుతున్నారు.
లేదంటే 25 చిత్రాలు చేసేందుకు చాలా సమయం పడుతుంది.అయితే గోపీచంద్ తక్కువ సమయంలోనే తన 25వ చిత్రంకు చేరుకున్నాడు.
25వ చిత్రంగా గోపీచంద్ ‘పంతం’ చిత్రాన్ని చేయడం జరిగింది.భారీ అంచనాల నడుమ రూపొందిన పంతం చిత్రం ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.ఈ చిత్రం ప్రస్తుతం భారీ ఎత్తున పబ్లిసిటీ కార్యక్రమాలు జరుపుకుంటుంది.25వ చిత్రం అవ్వడంతో నిర్మాతలు కూడా ఈ చిత్రానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి పబ్లిసిటీ చేస్తున్నారు.అయితే డిస్ట్రిబ్యూటర్లు మాత్రం గోపీచంద్ 25వ చిత్రంను పెద్దగా పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
గోపీచంద్ 25వ చిత్రం అనగానే నిర్మాత మరియు దర్శకుడు కాస్త ఎక్కువ దృష్టి మరియు ఎక్కువ ఖర్చు చేసి చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.
అయితే డిస్ట్రిబ్యూటర్లు మాత్రం సినిమాపై నమ్మకం పెట్టుకోవడం లేదు.ఎందుకంటే గోపీచంద్ గత చిత్రాలు సాదా సీదాగానే ఆడాయి.కొన్ని ఫ్లాప్ కూడా అయ్యాయి.అందుకే గోపీచంద్ 25వ చిత్రం అన్ని ఏరియాల్లో కలిపి అటు ఇటుగా కేవలం 13 కోట్లు మాత్రమే బిజినెస్ అయ్యిందని సమాచారం అందుతుంది.
దాదాపు 25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముందు నిర్మాతకు లాభాలు తెచ్చి పెడుతుందని ఆశించారు.కాని సినిమా సక్సెస్ అయితే తప్ప ప్రస్తుతం నిర్మాత పెట్టిన పెట్టుబడి రికవరీ అయ్యే అవకాశం లేదనిపిస్తుంది.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కోసం కూడా భారీగా చేస్తున్నారు.సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే పెద్దగా అంచనాలు లేని ఈ చిత్రంకు ఏ స్థాయిలో వసూళ్లు వస్తాయో చూడాలి.