ఏపీ ఎన్నికల్లో ప్రధానంగా … తలపడబోయే మూడు పార్టీలు అయిన వైసీపీ …టీడీపీ, జనసేన వీటిల్లో ఏ పార్టీ అధికారం లోకి వస్తుందో అన్న ఉతకంత నెలకొంది.ఈ విషయంలో మరింత టెన్షన్ పెట్టేలా … తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా ఎంటర్ అయిపొయింది.
టీఆర్ఎస్ ఎలాగూ టీడీపీని ఓడించడానికి కంకణం కట్టుకుంది.ఈ నేపథ్యంలో….
జనసేన , వైసీపీలో ఏ పార్టీకి మద్దతుగా నిలుస్తారు అనే సందేహం నెలకొంది.ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీతో వైసీపీ , జనసేన రెండు పార్టీలు మంచి సంబంధాలే కొనసాగిస్తున్నాయి.
అందుకే టీఆర్ఎస్ కూడా ….ఈ రెండు పార్టీలను కలిపి టీడీపీని చిత్తూ చేయాలనీ ప్లాన్ వేశారు.
అయితే … ఈ విషయంలో వైసీపీ జనసేన కూడా పట్టింపులకు వెళ్లి విడివిడిగానే పోటీ చేస్తామని ప్రకటించాయి.
టీఆర్ఎస్ పార్టీ తో అనుబంధం విషయంలో జనసేన కంటే… వైసీపీని మంచి సంబంధాలు కలిగి ఉంది.ఈ రెండు పార్టీ ల మధ్యఅనుబంధం అంతగా పెరగడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు.తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో మహాకూటమిని కేసీఆర్ చిత్తు చిత్తు చేశారు.
చంద్రబాబును కూడా తలెత్తుకోలేకుండా విమర్శించారు.ఆ కారణంగానే.
కేసీఆర్ పై.జగన్ కు మరింత అభిమానం పెరిగింది.అందుకే… కేసీఆర్ ను ఓ హీరోలా భావిస్తున్నారు.అంతకు ముందు జగన్.
తెలంగాణలో అడుగు పెడతానంటే.అదే కేసీఆర్.
అదే టీఆర్ఎస్.ఎలా అడ్డుకుందో అందరికీ తెలుసు.
ఆ దెబ్బకు జగన్ వెనక్కి వచ్చేశారు.కూడా.
అయితే ఇప్పుడు పరిస్థితి వేరు.ఈ రెండు పార్టీల మధ్య బంధాన్ని జనసేన జీర్ణించుకోలేక పోతోంది.అందుకే… ఈ రెండు పార్టీల స్నేహాన్ని పవన్ ఫోకస్ చేస్తున్నాడు.
దీనిలో భాగంగానే… వైసీపీ పార్టీ నేతలు తనతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారని… వారు .టీఆర్ఎస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారన్న విషయాన్ని బయటపెట్టి పవన్ రాజకీయ సంచలనం సృష్టించారు.ఈ వ్యవహారం.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కలకలం రేపింది.ఏపీలో మహాకూటమిని ఏర్పాటు చేయించాలనే పట్టుదలతో టీఆర్ఎస్ ఉన్నట్లు పవన్ ప్రకటన ద్వారా తేలింది.
ఇప్పుడీ ఆరోపణలను పవన్ కల్యాణ్ మరో స్థాయికి తీసుకెళ్తున్నారు.టీఆర్ఎస్ తో .వైసీపీ అధినేత జగన్ కు అంత అనుబంధం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.గతంలో.
జగన్ తో.టీఆర్ఎస్ ఎలా వ్యవహరించిందో గుర్తు లేదా అంటూ.విమర్శలు చేస్తున్నారు.ఈ పరిణామాలు చూస్తుంటే… వైసీపీ గెలుపుకు టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ బాటలు వేస్తుందో అన్న ఆందోళన కూడా… పవన్ లో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.