తెలంగాణ రాజకీయాల్లో రోజు రోజుకు రాజకీయ వాతావరణం మారుతోంది.తెలంగాణలో అంతగా బలంలేని బీజేపీకి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ బలహీనంగా మారడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాటల తూటాలు పేలుస్తూ ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీని మించి ప్రజాదరణను సొంతం చేసుకుంది.
అయితే బీజేపీ కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో ప్రచారాన్ని ప్రజలను కలిసి ప్రచారం చేసే వ్యూహం మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ టీఆర్ఎస్ పార్టీని దెబ్బతీస్తున్నారు.అయితే ఈ విషయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు కొంత వెనకబడ్డారని చెప్పవచ్చు.
అయితే బీజేపీ కార్యకర్తలు చేస్తున్న ప్రచారంతో పోటీపడలేక టీఆర్ఎస్ కార్యకర్తలు కొంత ఆత్మస్థైర్యం దెబ్బతింటున్నట్టు టీఆర్ఎస్ అధిష్ఠానానికి వార్త చేరింది.ఈ సందర్బంగా మొన్న కేటీఆర్ టీఆర్ఎస్వీ నేతలతో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడానికి ఇదే ప్రధాన కారణం.
అయితే త్వరలో జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తే మరల టీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్తేజితమయ్యే అవకాశం ఉంది.ఏది ఏమైనా రాజకీయ పార్టీల ప్రచార వ్యూహాలు మారుతున్నాయి కాబట్టి ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఆ వ్యూహానికి అనుగుణంగా మారాల్సి ఉంటుంది.
అప్పుడే ఆ పార్టీ పట్ల ప్రజలలో ఆదరణ అనేది మిగిలి ఉంటుంది.