ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ పై మాటల దాడి చేస్తూ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు వేస్తూ వేస్తూ రోజురోజుకు బలంగా దూసుకుపోతోంది.ఇప్పటివరకు బీజేపీ విమర్శల పట్ల మౌనం వహిస్తూ వచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ చేసిన ఒక తప్పు వల్ల ఆ తప్పు టీఆర్ఎస్ కు అస్త్రంగా మారింది.
ఇప్పటివరకు తెలంగాణలో మత రాజకీయాలకు స్థానం లేకుండా పోయింది.మతం ఆధారంగా రాజకీయ నాయకులు విమర్శలు చేసిన దాఖలాలు కాని ఎన్నికల ప్రచారంలో కూడా లేవు.
తెలంగాణలో బీజేపీ కొద్దో గొప్పో బలాన్ని ప్రదర్శించుకుంటున్న పరిస్థితులలో మత రాజకీయాలకు బీజేపీ నాయకులు తెర దీస్తుండడంతో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి.అయోధ్య ఆలయ నిర్మాణం కోసం విరాళాలు సేకరణ చేస్తున్న ప్రస్తుత పరిస్థితులలో మరి తెలంగాణలో ఉన్న భద్రాచల రామాలయ ఆలయానికి బీజేపీ ఇంతవరకు ఎందుకు శ్రద్ద చూపించలేదని టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
కావున బీజేపీకి రామునిపై ప్రేమ లేదని రాముని పేరుతో రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.తెలంగాణలో మతాల మధ్య చిచ్చు పెట్టే సంస్కృతి బీజేపీ వల్లే మొదలైందని టీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.