తమిళంలో ఘన విజయం సాధించినటువంటి 96 చిత్రాన్ని తెలుగులో “జాను” అనే పేరుతో రీమేక్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, బ్యూటిఫుల్ నటి సమంత అక్కినేని నటించారు.
అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.అంతేగాక నిర్మాతలకు కూడా కొంతమేర కష్టాలను తెచ్చిపెట్టింది.
అయితే తాజాగా ఈ చిత్రంలో హీరోగా నటించినటువంటి శర్వానంద్ గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే ఇటీవల హీరో శర్వానంద్ తన భుజం నొప్పితో బాధ పడుతున్నాడట.
అయితే ఈ భుజం నొప్పి కారణంగా సర్జరీ చేయించుకోడానికి ప్రస్తుతం అమెరికాకి వెళ్ళాడని, ఇందులో భాగంగా భారత సంతతి కి చెందినటువంటి ఓ ప్రముఖ వైద్యుడు పని చేస్తున్నటువంటి ఆసుపత్రిలో భుజం నొప్పికి సంబంధించి సర్జరీ చేయించుకున్నాడనీ పలువురు గుసగుసలాడుకుంటున్నారు.అందువల్లనే ప్రస్తుతం శర్వానంద్ కొంతకాలంపాటు తన చిత్ర షూటింగ్ లకు హాజరు కావడం లేదని వైద్యులు కూడా కొంతకాలం పాటు విశ్రాంతి అవసరమని సూచించడంతో ప్రస్తుతం శర్వానంద్ విశ్రాంతిలో ఉన్నట్లు సమాచారం.
అయితే ఈ విషయం గురించి నెట్లో పలు వార్తలు హల్చల్ చేయడమే కానీ శర్వానంద్ మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు.దీంతో ఈ వార్తలు నిజమో అబద్ధమో తెలియాలంటే శర్వానంద్ స్పందించాల్సి ఉంది.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శర్వానంద్ ప్రముఖ దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న టువంటి “శ్రీకారం” అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది.అలాగే ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల చేసేందుకు దర్శకుడు కిషోర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు.