కెరీర్ మంచి దశలో ఉన్న సమయంలో రవితేజ వరుసగా చెత్త సినిమాలు చేసి వరుసగా ఫ్లాప్లు పొందాడు.దాంతో ఆలోచనల్లో పడ్డ రవితేజ ఆ తర్వాత కథల ఎంపికలో, దర్శకుడి ఎంపికలో స్పీడ్ తగ్గించాడు.
అలా చేయడం వల్ల రవితేజకు ‘బలుపు’ మరియు ‘పవర్’ వంటి రెండు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లు దక్కాయి.ఆ తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డిపై నమ్మకం పెట్టుకు ‘కిక్ 2’ చిత్రంలో నటించాడు.
ఆ సినిమా కాస్త రవితేజకు మళ్లీ మునుపటి ఫలితాన్ని తెచ్చింది.‘కిక్’ చేసే సమయంలోనే రవితేజ తన తర్వాత సినిమాను సంపత్ నంది దర్శకత్వంలో చేసేందుకు కమిట్ అయ్యాడు.
ఆ సినిమా తాజాగా పూర్తి అయ్యి, విడుదలకు సిద్దం అయ్యింది.
‘రచ్చ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంపత్ నంది ‘బెంగాల్ టైగర్’తో రవితేజకు సూపర్ హిట్ ఇస్తాడు అనే నమ్మకం సినీ వర్గాల్లో లేదు.
ఈ సమయంలో కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన రవితేజ కొత్త దర్శకుడు తీసుకు వచ్చిన మాస్ మసాలా కథను ఓకే చేశాడు.‘బెంగాల్ టైగర్’ ఫలితం వచ్చిన తర్వాత రవితేజ తన తర్వాత సినిమాను ఓకే చెప్తే బాగుండేది అని కొందరి అభిప్రాయం.
తాజాగా చక్రి అనే సహాయ దర్శకుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఒక సినిమాలో నటించేందుకు రవితేజ ఓకే చెప్పాడు.దాంతో రవితేజ చేసిన ఈ పనిని కొందరు విశ్లేషకులు తప్పుబడుతున్నారు.
ఈ సమయంలో కథల ఎంపికకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు రవితేజకు సలహాలు ఇస్తున్నారు.మరి రవితేజ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.