తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కొన్ని సంవత్సరాలు తెలుగు చిత్ర పరిశ్రమలో చక్రం తిప్పిన దర్శకుడు.
కొన్ని కారణాల వలన కొద్దీ రోజులు ఇండస్ట్రీకి దూరమైన పూరి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళి ఫామ్ లోకి వచ్చాడు.ఇక మొదట పూరి తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరో అనిపించుకోవడానికి పాపం పూరిని బాగానే నష్టపెట్టాడు.
ఇంతలో కొడుకు ఎదిగివచ్చాడు.
అయితే కొడుకు ఆకాష్ పూరి కోసం పూరి జగన్నాథ్ తనకున్న కాస్త డబ్బును పెట్టుబడిగా పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.
ఆకాష్ పూరి మొదటి సినిమా వల్లే పూరికి పదిహేను కోట్లు వరకూ లాస్ అట, అయినా పూరి మాత్రం కొడుకు మీద ప్రేమతో మరో పదికోట్లు ఖర్చు పెట్టి మరో సినిమా తీస్తున్నాడు.ఇది కూడా తేడాగానే ఉంది అనేది ఫిల్మ్ నగర్ టాక్.
ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది.డైరెక్టర్ పూరి జగన్నాధ్ కథ మాటలతో ఆయన అసోసియేట్ అనిల్ పాదూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఆకాష్ రొమాంటిక్ సినిమా తెరకెక్కింది.పూరి మార్క్ లవ్ అండ్ రొమాన్స్ తో పాటు మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన రొమాంటిక్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ఫైనల్ స్టేజ్ కి వచ్చింది.
ఈ క్రమంలో త్వరలో రొమాంటిక్ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నారట చిత్ర యూనిట్.అంతేకాదు ఈ ‘రొమాంటిక్’ ఎంటర్టైనర్ ని రొమాంటిక్ డే అయిన ఫిబ్రవరి 14 న రిలీజ్ చేసేందుకు పూరి టీం ప్లాన్ చేస్తున్నారట.
ఆకాష్ పూరి డెబ్యూ సినిమా మెహబూబా సినిమాకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది.
కొడుకు వల్ల ఇప్పటికే పదిహేను లాస్, ఇప్పుడు మరో పదిహేను అంటే.అది పూరి కెరీర్ కే ప్రమాదం.
మరి మాఫియా నేపథ్యంలో జరిగే ఓ ప్రేమ కథగా వస్తోన్న ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందో లేదో చూడాలి మరి.