ప్రస్తుతం తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఇప్పటికే ప్రభుత్వం కూడా లాక్ డౌన్ విధించడంతో కొద్ది మేర కేసులు తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తున్నా ఇంకా చాలా వరకు యాక్టివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
కేసులు నమోదవుతున్నా మరణాల రేటు తగ్గితేనే ప్రజల్లో ఉన్న భయాందోళనలు కొంత మేర తొలిగిపోయే అవకాశం ఉంది.అయితే తాజాగా కేసీఆర్ గాంధీ ఆసుపత్రిని సందర్శించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పటి వరకు కేసీఆర్ ఏ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన పరిస్థితి లేదు.అయితే తాజాగా కేసీఆర్ గాంధీని సందర్శించడం పెద్ద సంచలనమైన విషయం తెలిసిందే.
ఇలా హడావిడిగా కేసీఆర్ ఆసుపత్రిని సందర్శించడం వెనుక ఒక ప్రధాన వ్యూహం ఉంది.అయితే ఇప్పటికే ప్రజలు కరోనా బారిన పడుతుంటే కేసీఆర్ ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి ఫామ్ హౌజ్ లో కాలక్షేపం చేస్తున్నాడని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ విమర్శలను కేసీఆర్ పట్టించుకున్నాడో లేక ఒక ముఖ్యమంత్రిగా పర్యటించాడనే విషయం అప్రస్తుత విషయం అయినప్పటికీ, ప్రజల్లో కేసీఆర్ పట్ల మాత్రం ఈ విషయం పై పెద్ద ఎత్తున విమర్శ అయితే బలంగా ఉంది.ప్రజలకు ఒక ముఖ్యమంత్రిగా భరోసా ఇవ్వడం లేదనే విమర్శకు గాంధీ ఆసుపత్రి పర్యటనతో చెక్ పెట్టాడనే చెప్పవచ్చు.