తెలంగాణలో టీడీపీ పరిస్థితి మునిగిపోయిన నావ అన్న చందంగా మారిపోయిందన్న విషయం తెలిసిందే.తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించడంతో రెండు కళ్ళ సిద్దాంతం పేరుతో పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టే సమయంలో చంద్రబాబు వ్యవహారించిన తీరు తెలంగాణ ప్రజల్లో టీడీపీ అంటే వ్యతిరేకత ఏర్పడింది.
ఇక ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి ఉంది.అయితే ఇక తలసాని లాంటి వాళ్ళు టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరి రెండు దఫాలుగా ఏర్పడ్డ ప్రభుత్వంలో మంత్రి పదవి ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
అయితే అందరూ వెళ్లిపోయినా ఎల్.రమణ మాత్రం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతూ వచ్చారు.కాని ఇప్పడు తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.అయితే రమణ టీడీపీకి గుడ్ పై చెప్పడానికి ప్రధాన కారణమేంటని విశ్లేషిస్తే టీడీపీకి ఇక తెలంగాణలో మనుగడ లేదనే ఉద్దేశ్యంతో టీడీపీకి గుడ్ పై చెప్పినట్లు తెలుస్తోంది.
ఎందుకంటే ఇప్పట్లో టీడీపీని ప్రజలు నమ్మాలంటే చాలా రకాల కార్యక్రమాలు చేపట్టవల్సి ఉంటుంది.చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో ఉన్న తెలుగు దేశంపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఇప్పట్లో తెలంగాణపై దృష్టి సారించే అవకాశం లేకపోవడం మరొక కారణమని చెప్పుకోవచ్చు.