తెలంగాణలో రాజకీయ వాతావరణం రోజు రోజుకు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలతో హాట్ హాట్ గా సాగుతున్నాయి.ఇప్పటికే కేసీఆర్ వరి ధాన్యం కొనుగోలు పట్ల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఎంత దుమారాన్ని రేపాయో మనం చూశాం.
అయితే కేసీఆర్ వ్యాఖ్యల తరువాత బీజేపీ దూకుడు మరింతగా పెరిగింది.అయితే బీజేపీని మొత్తం తెలంగాణలో బలహీనం చేయడానికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక వినూత్న ప్రచారానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.
ఆ ప్రచారం ఏంటనే విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంపై గుజరాత్ వాళ్ళ కన్ను పడిందని , తెలంగాణ అభివృద్ధి చెందడం వాళ్ళకు నచ్చడం లేదని అందుకే తెలంగాణ వారికి తెలంగాణ వారికి మధ్య చిచ్చు పెడుతున్నారని, ఈ సమయంలోనే తెలంగాణ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని బీజేపీ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తోంది.
బీజేపీ ఇంతలా దూకుడు పెంచడానికి ఇంతటి మాస్టర్ ప్లాన్ ఉందా అని రాజకీయాలపై ఎటువంటి అవగాహన లేదని సామాన్య ఓటరుకు ఎక్కడో ఒక చోట టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంపై ఒకింత ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఈ ప్రచారంపై బీజేపీ ఇంకా స్పందించకున్నా చాలా వరకు ఇటువంటి ప్రచారాన్ని రానున్న రోజుల్లో టీఆర్ఎస్ మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళే అవకాశం ఉంది.ఏది ఏమైనా ఏదైనా హిడెన్ ఎజెండాతో బీజేపీ తెలంగాణలో ఇంతలా దూకుడు ప్రదర్శిస్తోందా ఒక వేళ ఇది నిజమే అయితే మాత్రం తెలంగాణ ప్రజలు త్వరిత గతిన గమనిస్తేనే మన తెలంగాణ మన చేతుల్లో ఉంటుందని మేధావుల వర్గాలలో కూడా చర్చ జరుగుతోంది.
మరి టీఆర్ఎస్ చేస్తున్న ఈ ప్రచారం పట్ల బీజేపీ పార్టీ స్పందిస్తుందా లేక స్పందిస్తే ఎలా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది.