తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం ఇంకా దూకుడు పెంచిన పరిస్థితి ఉంది.ఇప్పటికే కోవిడ్ కాలంలో పనిచేసిన స్టాఫ్ నర్సుల వ్యవహారంలో ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే.
అంతేకాక ఇక బాధ్యతలు చేపట్టక ముందు సీనియర్ లను అందరినీ కలుపుకు పోయిన రేవంత్ ఇప్పుడు వరుసగా రకరకాల ప్రభుత్వ నిర్ణయాల మీద నిరసన గలం వినిపించడానికి వరుస పర్యటనలు చేస్తున్న పరిస్థితి ఉంది.నేడు పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు పిలుపు నిచ్చిన విషయం తెల్సిందే.
అయితే ఈ సందర్బంగా నిర్మల్ చేరుకున్న రేవంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డితో కలిసి నిరసనలో పాల్గొన్న పరిస్థితి ఉంది.ఇలా ప్రభుత్వ నిర్ణయాలపై వరుస నిరసనలకు పిలుపునిచ్చే అవకాశం ఉంది.ఇలా చేయడం వల్ల ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణులు కూడా ఉత్తెజితులు అవడమే కాకుండా కాంగ్రెస్ వైపు ప్రజలు చూసే అవకాశం ఉంది.ఇక రేవంత్ మార్క్ పనితీరు చూపించే అవకాశం ఉంది.
ఎందుకంటే కాంగ్రెస్ కు ఇది క్లిష్ట సమయం కాబట్టి ఈ సమయంలో కాంగ్రెస్ ను రకరకాల పోరాటాలతో ఉత్తేజితం చేస్తేనే కాంగ్రెస్ కు లాభం జరిగే అవకాశం ఉంది.