పవన్ కళ్యాణ్ రీఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది.దిల్రాజు స్వయంగా ప్రకటించాడు.పవన్తో సినిమా చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.20 ఏళ్లుగా కోరుకుంటున్న కల నిజం కాబోతుంది అంటూ దిల్రాజు ప్రకటించాడు.పింక్ రీమేక్ను తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్రాజు నిర్మించబోతున్నాడు.పింక్ సినిమా అనేది ఒక కమర్షియల్ కాన్సెప్ట్ కాదు.అమ్మాయిలు ఎదుర్కొంటున్న వేదింపులకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి చేసిన పోరాటం.
పింక్ చిత్రంలో అమితాబచ్చన్ నటించాడు.లాయర్గా అమితాబచ్చన్ ఆకట్టుకున్నాడు.తమిళంలో ఆ పాత్రను అజిత్ చేశాడు.
తమిళంలో కూడా సక్సెస్ అయ్యింది.హిందీ మరియు తమిళంలో సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు దిల్రాజు ఉత్సాహం చూపిస్తున్నాడు.
పవన్ 20 రోజులు డేట్లు ఇచ్చినా చాలు అంటూ దిల్రాజు ఈ సినిమాను మొదలు పెట్టాడు.కేవలం రెండు నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేసి సమ్మర్లో విడుదల చేయాలని భావిస్తున్నారు.
అంతా బాగానే ఉంది కాని పవన్ను లాయర్గా చూడగలమా అంటూ కొందరు మెగా ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే రాజకీయాల వల్ల పవన్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది.ఇప్పుడు పింక్ సినిమాతో తన సినీ కెరీర్ను కూడా పవన్ నాశనం చేసుకుంటాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.పవన్కు ఈ సబ్జెక్ట్ సూట్ అవ్వదు అంటూ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కాని పవన్తో సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను దిల్రాజు చేస్తున్నాడు.మరి ఫలితం ఏంటో చూడాలి.
తాజా వార్తలు