టాలీవుడ్ సినీనటి కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం వరుస ఆఫర్లతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.వరుస సినిమాలలో నటిస్తూ మంచి క్రేజ్ అందుకుంటుంది.
అతి తక్కువ సమయంలో పేరు సంపాదించుకున్న రష్మిక స్టార్ హీరోల సరసన అవకాశాన్ని దక్కించుకుంది.ప్రస్తుతం ఆమెకు ఇండియా క్రష్ అని ఓ పేరు కూడా వినిపిస్తుంది.
వెండితెరపైనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఇక యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.ఎక్కువ గ్లామరస్ పాత్రలో నటించే రష్మిక తన నటనతో టాలీవుడ్ లో స్టార్ స్థానాని సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా రష్మిక గ్లామరస్ పాత్ర లో కాకుండా ప్రస్తుతం పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది.
ప్రస్తుతం రష్మిక తమిళంలో బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సుల్తాన్ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాలో కార్తీ హీరోగా నటిస్తున్నాడు.యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో ఈ సినిమా రానుంది.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై యస్.ఆర్.ప్రకాష్ బాబు,యస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాయి.
ఇక అందులో రౌడీలైతే భయపడాలా అంటూ రష్మిక చెప్పిన డైలాగులు చూస్తుంటే ఇందులో రష్మిక ఎవరికీ భయపడని రెబల్ అమ్మాయిగా అనిపిస్తుంది.ఇక మొత్తం పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనున్న రష్మిక ఈ పాత్రలో నటించడానికి ఓ పెద్ద కథే ఉందని అంటున్నారు.
మామూలుగా రష్మిక మందన గ్లామరస్ పాత్రలకే ఆసక్తి చూపుతుంది కానీ ప్రస్తుతం ఈ పాత్రలో కనిపించడానికి ఓ కారణం ఉందని అంటున్నారు.రష్మిక ఎక్కువ సోషల్ మీడియాలో ఓవరాక్షన్ చేసే హీరోయిన్ గా ఎంతోమంది ట్రోల్ చేస్తుంటారు.అంతేకాకుండా ఆమె మాట్లాడే మాటలకు ఎక్కువ నెగిటివిటీ కూడా వస్తుంటాయి.ఆమె తన లో ఉన్న నెగిటివ్ ను తొలగించడానికి.ఓ పాజిటివ్ ఉండే పాత్రలో నటించాలనుకుంది.అందుకే ఈసారి రష్మిక పల్లెటూరి అమ్మాయి గా నటించాలని అనుకుంది.
మొత్తానికి రష్మిక తనపై పాజిటివ్ ను పెంచుకోడానికే ఇలాంటి పాత్రలో నటిస్తుందని అంటున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా ఏప్రిల్ 2న విడుదలకానుంది.
తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేయనున్నారు.ఇక రష్మిక బాలీవుడ్ లో రెండు సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తెలుగులో పుష్ప లో బిజీగా ఉంది.