నిన్న కేబినేట్ భేటీ ముగిసిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారని అంతా ఎదురు చూశారు.ఈ సారి ప్రెస్ మీట్ కు ఆయన జాతీయ మీడియాను సైతం ఆహ్వానించారు.
కానీ ఏమైందో ఏమో తెలియదు ప్రెస్ మీట్ కు రాకుండానే ఆయన వెళ్లిపోయారు.ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే ఏ విషయాలను చెబుతారని పలువురు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు.
అలా ఎదురు చూసిన వారందరికీ కేసీఆర్ నిరాశనే మిగిల్చారు.ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయకపోవడానికి గల కారణాలను కూడా ప్రస్తుతం కొంత మంది విశ్లేషిస్తున్నారు.
ఈ కారణం వల్లే నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయలేదని చెబుతున్నారు.కేసీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయకపోవడానికి వారు చెప్పే కారణాలు ఏంటంటే.
బీజేపీకి పోటీగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు.అందుకోసమని మూడో ఫ్రంట్ ఏర్పాట్లలో తలమునకలయ్యారు.ఇది వరకే దేశంలో ఉన్న బీజేపీ యేతర ముఖ్యమంత్రులు మరియు పార్టీల అధినేతలతో చర్చలు సాగిస్తున్నారు.కానీ బీజేపీ మీద కేసీఆర్ సాగిస్తున్న పోరాటానికి జాతీయ స్థాయిలో పెద్దగా గుర్తింపు రావడం లేదని ఈ సారి జాతీయ మీడియాను కూడా పిలిచారు.
కానీ చివరికి మీడియా సమావేశం ఏర్పాటు చేయకుండానే ఆయన వెనుదిరిగారు.ఒక వేళ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే థర్డ్ ఫ్రంట్ గురించే విలేకరులు ఎక్కువగా ప్రశ్నిస్తారని అందుకోసమే ఈ ప్రెస్ మీట్ ను ఆయన రద్దు చేసుకుని వెళ్లి ఉంటారనే అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ మీద టీఆర్ఎస్ సాగిస్తున్న యుద్ధం గురించి పూర్తిగా తెలుస్తుందనే ప్రెస్మీట్ లేకుండా రద్దు చేసుకోవడంతో పలువురు నిరాశకు గురయ్యారు.మరలా కేసీఆర్ ఎప్పుడు ప్రెస్మీట్ పెడతారా? అని ఎదురు చూస్తున్నారు.