టీడీపీ నేత బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు.టీడీపీలో పదవులతో పాటు నేతలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని తెలిపారు.
వైసీపీలో పదవులు ఉంటాయి కానీ.నాయకులకు సరైన గుర్తింపు ఉండదని బుద్దా వెంకన్న విమర్శించారు.
ఈ క్రమంలోనే వైసీపీలో ఒకరైన గుర్తింపు పొందిన బీసీ నేత ఉన్నారా అని ప్రశ్నించారు.రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పదవి కృష్ణయ్యకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబును అరెస్ట్ చేస్తే వంద దేశాల్లో ఆందోళన చేశారని గుర్తు చేశారు.అంబటి రాయుడు ఆడుదాం ఆంధ్రాకి బ్యాట్ పట్టుకొని వచ్చారన్న బుద్దా వెంకన్న పార్టీలో చేరిన వారానికే అంబటి రాయుడు రాజీనామా చేశారని విమర్శించారు.