రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చాలా సర్వ సాధారణం.అయితే అధికార పార్టీని విమర్శిస్తున్నారంటే అందులో ఎంతో కొంత ప్రజలు విశ్వసించదగిన అంశాలు ఉండాలి.
లేకపోతే ప్రజలు తొలుత కొద్ది రోజులు సీరియస్ గా తీసుకున్నా ఆ తరువాత ఇక పదునైన విమర్శలు.ఎంతో కొంత సత్యమైన విషయం ఉన్నా ఎంత ప్రయత్నం చేసినా ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి ఉండదు.
ఒకవేళ ప్రజల్లోకి వెళ్ళినా దాని వల్ల పార్టీకి పెద్దగా ప్రయోజనం అనేది ఉండదు.ప్రస్తుతం బీజేపీ కూడా ఇదే పరిస్థితికి చాలా దగ్గరగా ఉన్నట్టు పరిస్థితులను బట్టి అర్ధమవుతోంది.
ఏతే తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యలను అనుసరించి కేంద్రం ఎలాగూ కొనమని స్పష్టం చేసినా కూడా వరి సాగు చేస్తే రైతులు చాలా వరకు నష్టపోయే పరిస్థితి ఉంటుంది.
ఇప్పటికే బండి సంజయ్ వ్యాఖ్యలు తప్పు అని ప్రజల్లోకి రైతుల వద్దకు తీసుకెళ్లడంలో కెసీఆర్ విజయం సాధించిన పరిస్థితి ఉంది.
తాజా ఢిల్లీ పర్యటనతో బీజేపీ ని మరింతగా ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక బండి సంజయ్ ఇక రానున్న రోజుల్లో ఎన్ని విమర్శలు చేసినా ఇటీవల చేసిన విమర్శలు వెళ్లినంతగా బలంగా వెళ్ళే అవకాశం లేదు.
ఏది ఏమైనా బండి సంజయ్ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో మిగతా రాజకీయ నాయకులకు ఒక మంచి ఉదాహరణగా అనిపించిన సందర్భం ఉంది.
అయితే ఇప్పటికే క్షేత్ర స్థాయిలో క్యాడర్ నిర్మాణానికి బీజేపీ కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో ఇక పూర్తి స్థాయి సమరానికి బీజేపీ సిద్దమవుతోంది.అయితే సార్వత్రిక ఎన్నికలు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగానే జరిగే అవకాశం కనిపిస్తోంది.ఇప్పటికైనా బండి సంజయ్ కొన్ని అధికారిక విషయాలపై ఆచితూచి స్పందిస్తారా మరల బీజేపీని ఇరుకున పెట్టే విధంగానే వ్యవహరిస్తారా అనేది చూడాల్సి ఉంది.