ఏపీలో టీడీపీకి అధికార పార్టీ వైసీపీకి మధ్య ఉన్న పొలిటికల్ వార్ అందరికి తెలిసిందే.ఇక జగన్ అండ్ కో బృందం టీడీపీని నోరుమెద పకుండా విరుచుకుపడుతున్నారు.
ఒకనొక దశలో చంద్రబాబు దుఃఖించాల్సిన పరిస్థితి వచ్చింది.ఇక గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని చేసే ఘాటు వ్యాఖ్యలు, ప్రసంగాలు కంటిలో నలుసులా మారుతున్నాయి.
ఆయనకు ధీటుగా కౌంటర్లు ఇచ్చే వారు టీడీపీలో లేరనడంలో సందేహం లేదు.కాగా 2024 ఎన్నికల్లో కొడాలి నానిని ఓడించాలంటే అంతటి స్థాయిలో నేతలు లేరు.
దీంతో టీడీపీలో పొలిటికల్గా రాజకీయవేడి అంటుకుంది.గుడివాడలో ఎవరినైనా నిలబెడుదామనుకున్నా ఎవరూ ముందుకు రాని పరిస్థితి.
ఈ నేపథ్యంలోనే టీడీపీ ఏమి చేయాలన్నది సమస్యగా మారుతోంది.
టీడీపీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరినైనా ఒకరిని బరిలో దింపితే ఎలా ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది.
ఇప్పటికే ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ అనంతపుంర జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు.ఆయనను ఈసారి హిందూపురం నుంచి కాకుండా గుడివాడ నుంచి పోటీ చేయిస్తే ఫలితాలుంటాయని బాబు చెబుతున్నారని సమాచారం.
కానీ, దీనికి బాలయ్య నిరాకరిస్తే ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఒకరిని బరిలో నిలపొచ్చనే అంచనాలో బాబు ఉన్నట్టు తెలిసింది.అయితే ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన హరికృష్ణ కూతురు సుహాసిని తెలంగాణ రాష్ట్రం కూకట్పల్లి నియోజకవర్గం తరపున 2018 ముందస్తు ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన విషయం విధితమే.
ఎన్టీఆర్ ఫ్యామిలీ చాల పెద్దదే.అధిక సంఖ్యలో కుటుంబీకులు ఉన్నారు.కానీ, అందరికి తెలిసింది కొద్దిమంది మాత్రమే.అయినా కొడాలి నానిని ఢీకొట్టేంత శక్తి ఆ ఫ్యామిలీలో ఎవరికుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది.ఎన్టీఆర్ ఫ్యామిలీ అనగానే ఓట్లు వేసే పరిస్థతిలో జనాలు లేరని గతంలోను ప్రస్పుటమైంది.ఈ క్రమంలోనే జరగబోయే సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు, మహానాడు వేదికగా ఎన్టీఆర్ ఫ్యామిలీని పరిచయం చేసి, ఆ తరువాత బరిలో దింపుతారని టాక్.
బాబు ఫ్యామిలీ మాస్టర్ ప్లాన్ నెరవేరుతుందా ? లేదా ? అన్నది వేచి చూడాల్సిందే.