రాజకీయాల్లో పదవి ఎప్పటికీ శాశ్వతం కాదు.అప్పటి వరకు వెలుగు వెలిగి చక్రం తిప్పిన నేతలు కూడా ఒక్క సారిగా ఢీలా పడిపోతుంటారు.
అయితే ఇలాంటి సమయంలోనే వారు తీసుకునే నిర్ణయాలు మళ్లీ వారికి అధికారిన్న దగ్గర చేస్తుంటాయి.ఇప్పుడు టీడీపీలో ఓ మాజీ మంత్రి ఇలాంటి ప్రతికూల పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు.
వాస్తవానికి ఆమె వైసీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది.కానీ అనుకోకుండా చంద్రబాబు నాయుడు ఆశ చూపడంలో అటు వైపుగా అడుగులు వేసింది.
ఏకంగా టీడీపీలో చాలా చిన్న ఏజ్లోనే మంత్రి కూడా అయిపోయింది.
కానీ 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడిపోయిది.
ఇది చాలదన్నట్టు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది.రీసెంట్ గా భూకబ్జా ఆరోపణలపై అరెస్టు అయి జైలుకు కూడా వెళ్లి వచ్చింది.
ఆమెనే భూమా అఖిల ప్రియ. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తనను టీడీపీలో ఎవరూ పట్టించుకోవట్లేదని ఆమె డిసైడ్ అయిపోయింది.
అందుకే చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం లేక పార్టీ మారేందుకు రెడీ అయిపోయినట్టు తెలుస్తోంది.ఇప్పుడు తాను ఎలాగ వైసీపీలోకి వెళ్లలేదు కాబట్టి జనసేనలోకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీలోకి వెళ్తేనే సమస్యలు పరిష్కరాం అవుతాయని అనుకున్నా కూడా ఆమె వైసీపీని వద్దనుకుని టీడీపీలో జాయిన్ అయిపోయిన సంగతి తెలిసిందే.అందుకే ఇప్పుడు ఆమె అటువైపు కాకుండా రాబోయే రోజుల్లో బలపడే అవకాశం ఉన్న జనసేన వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.కర్నూలు జిల్లాలో కనుమరుగైపోతున్న టీడీపీలో ఉంటే ప్రమాదమేనని ఆమె అంటున్నారు.ఇక రాబోయే ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇస్తుందనే నమ్మకం కూడా లేకపోవడంతో ఆమె వేరే ఆప్షన్ లేక జనసేనలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారంట.
ఇక చంద్రబాబు కూడా ఎలాగూ పట్టించుకోవట్లేదు కాబట్టి ప్రత్యామ్నాయమే బెటర్ అని అనుకుంటున్నారంట.