సాధారణంగా ఇండస్ట్రీలో వారసత్వం కొనసాగడం సర్వసాధారణం.అయితే ఇప్పటికే ఎంతోమంది హీరో హీరోయిన్ల వారసులు వారసురాళ్లు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమ టాలెంట్ నిరూపించుకుంటూ ఉన్నారు.
ఇక వారసురాళ్ల విషయానికి వస్తే.జీవిత రాజశేఖర్ కుమార్తెలు హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
అలాగే మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక హీరోయిన్ గా ఇండస్ట్రీకి వచ్చారు.మంచు ఫ్యామిలీ నుంచి లక్ష్మి ప్రసన్న కూడా ఇండస్ట్రీలోకి వచ్చారు.
ఇక సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేదు.
నందమూరి హీరోగా బాలకృష్ణకు ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.
అయితే బాలకృష్ణ తన ఇద్దరు కుమార్తెలను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు.ఇలా బాలకృష్ణ కుమార్తెలు ఇండస్ట్రీలోకి రాకపోవడానికి గల కారణం ఏంటి అనే విషయం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.
అయితే బాలకృష్ణ తన కూతుర్లు ఇండస్ట్రీలోకి రావడం ఆయనకు ఏ మాత్రం అభ్యంతరం లేదని అయితే తన కుమార్తెలకు స్క్రీన్ పై గ్లామర్ షో చేస్తూ కనిపించడం ఇష్టం లేకపోవటం వల్లే ఇండస్ట్రీలోకి రాలేదని తెలుస్తోంది.
ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఇంట్లో జన్మించినటువంటి బ్రాహ్మణికి సినిమాలు అంటే ఏమాత్రం ఇష్టం లేదని ఆమె చూపు మొత్తం వ్యాపారాలపైనే ఉండడంతో తాను బిజినెస్ ఉమెన్ గా స్థిరపడినట్లు తెలుస్తోంది.ఇక చిన్న కుమార్తె తేజస్వినికి సినిమాలపై ఆసక్తి ఉన్నప్పటికీ ఈమెకు తెరపై కన్నా తెర వెనుక ఉండి సినిమాల కోసం పనిచేయడం ఇష్టం కావడంతో ఈమె కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేకపోయారు.ఇలా వీరు హీరోయిన్లుగా రాకపోయినా వారికి ఇష్టమైన రంగంలో స్థిరపడి మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు.