తెలుగు రాజకీయాల్లో ఆయన కీలక నేత… నాలుగు దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆ సీనియర్ నేత ఇప్పుడు రాజకీయాలకు పూర్తిగా రిటైర్మెంట్ చెప్పేసినట్టే కనిపిస్తోంది.కాంగ్రెస్ కురువృద్ధ నేత అయిన కె.
జానారెడ్డి తెలుగుదేశం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లోకి జంప్ చేశారు.
వరుస విజయాలతో సుదీర్ఘకాలం మంత్రిగా ఉన్న రికార్డు కూడా ఆయన సొంత మైంది.
అలాంటి జానారెడ్డి 2018లో జరిగిన ఎన్నికల్లో తన కంచుకోట లాంటి నాగార్జునా సాగర్లో ఓడిపోయారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయ్యాక జరిగిన 2014 ఎన్నికలలో గెలిచిన జానారెడ్డి సీఎల్పీ లీడర్ గా ఉండి ప్రభుత్వానికి, విపక్షానికి మధ్య పెద్దన్న పాత్ర పోషించారు.సీఎం కేసీఆర్ సైతం జానారెడ్డికి ఎంతో గౌరవం ఇచ్చేవారు.
అసెంబ్లీలో జానారెడ్డి ఏం చెప్పినా నాడు అధికార పక్షం వినేది.అలాంటి జానారెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోయాక బయటకు రావడం లేదు.
కాంగ్రెస్ ఎన్ని గ్రూపులు ఉన్నా కూడా అన్ని గ్రూపుల నేతలు కూడా జానాకు ఎదురు చెప్పేవారు కాదు.అయితే ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నా ఆయన బయటకు రావడం లేదు.
ప్రచారం కూడా చేయడం లేదు.జానారెడ్డి గాంధీభవన్కే వచ్చి రెండేళ్లు అవుతోందని చెపుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మణికం ఠాగూర్ ఇక్కడ ఛార్జ్ తీసుకునేందుకు వచ్చినా కూడా జానారెడ్డి రాకపోవడం చర్చనీయాంశమైంది.
ఇక నాగార్జునసాగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బాధ్యతలను తన కుమారుడు రఘువీర్ రెడ్డికి అప్పగించి తాను రిటైర్ అయ్యే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.
ఇక జానారెడ్డి ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశాలు కూడా లేనట్టే.?
.