రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం.ఎందుకంటే నిన్న అధికారంలో ఉన్న వారు ఈ రోజు ప్రతిపక్షంలో కూర్చోవచ్చు.
మొన్నటి దాకా కంటి చూపుతో జిల్లాను శాసించిన వారు కనీసం ఉనికి చాటుకోలేని స్థితిలో ఉండొచ్చు.ఈ పరిస్థితులు ఇప్పుడు టీడీపీలో ఉన్న మహామహులను చూస్తే ఇట్టే అర్థం అవుతుంది.
ఈ పార్టీలో ఉన్న ఉద్ధండులంతా కూడా గతంలో తమ జిల్లాలను శాసించిన వారే.అయితే తర్వాత పరిస్థితులు మారిపోయాయి.
చాలా మంది అధికారం కోల్పోయి కనీసం సొంత జిల్లాల్లో కనుమరుగైపోయారు.
ఇలాంటి వారిలో కర్నూలు జిల్లా రాజకీయాలను శాసించిన భూమా నాగిరెడ్డి కుటుంబం కూడా ఉంది.
ఆయన తర్వాత మంత్రిగా చేసిన భూమా అఖిల ప్రియ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అందరికీ తెలిసిందే.అయితే ఈమె ఓడిపోవడం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత ఆమెకు కనీసం పార్టీలో కూడా పెద్దగా గుర్తింపు ఇవ్వకపోవడం ఇంకో ఎత్తు.
ఆమెను చంద్రబాబు కూడా పక్కన పెట్టేస్తున్నారు.ఇప్పటికే ఆమె మీద వస్తున్న ఎన్నో ఆరోపణలతో కేసులతో నానా ఇబ్బందులు పడుతూనే ఉంది.ఇలాంటి తరుణంలోనే చంద్రబాబు కూడా ఆమెను పక్కన పెడుతున్నారు.
దీంతో ఇంకా టీడీపీలోనే కొనసాగితే మాత్రం తనకు ఆళ్లగడ్డ టికెట్ ఇచ్చి నంద్యాల టికెట్ తన తమ్ముడికి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తోంది.కానీ దీనిపై చంద్రబాబు నాయుడు మాత్రం హామీ ఇవ్వకపోవడంతో చేసేది లేక ఆమె టీడీపీ నుంచి పవన్ పార్టీలోకి మారనున్నట్టు తెలుస్తోంది.పైగా ఆళ్లగడ్డలో కాపు ఓట్లు ఎక్కువగా ఉండటంతో పవన్ మద్దతు ఉంటే గెలుపు అవకాశాలు ఉంటాయని ఆమె భావిసప్తున్నారు.
ఈ మధ్య కాపులు కూడా పవన్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఒక్కటవుతున్న నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే సోషల్ మీడియాలోనూ అఖిలప్రియ జాయినింగ్ మీద విపరీతంగా చర్చ సాగుతోంది.