ఒకసారి కొంతమంది హీరోయిన్లు వచ్చీరావడంతోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకున్నప్పటికీ వ్యక్తిగత కారణాలు లేదా అనివార్య కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోలేక దూరంగా వెళ్లిపోయిన హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు.అయితే ఇందులో టాలీవుడ్లో ప్రముఖ స్టార్ హీరో సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ హీరోగా నటించిన “ప్రేమ కావాలి” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయమైన ముంబై బ్యూటీ “ఇషా చావ్లా” కూడా ఈ కోవకే చెందుతుంది.
అయితే ఇషా చావ్లా వచ్చీరావడంతోనే తన నటనతో బాగానే ఆకట్టుకోవడంతో టాలీవుడ్ ప్రముఖ హీరో మరియు కమెడియన్ సునీల్ హీరోగా నటించిన “పూల రంగడు” చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
దీంతో ఈ అమ్మడి సినీ కెరియర్ దాదాపుగా టాలీవుడ్ లో సెటిల్ అయింది.
కానీ ఆ తరువాతి చిత్రాలలో కథల పట్ల మరియు తన పాత్రల పట్ల సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో పలు డిజాష్టర్లని ఎదుర్కొంది.
ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ తో హీరోయిన్ గా నటించిన శ్రీమన్నారాయణ, మిస్టర్ పెళ్ళికొడుకు, జంపు జిలాని, తదితర చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.దీంతో ఈ ప్రభావం ఈ అమ్మడి సినిమా కెరియర్ పై పడింది.
దాంతో సినిమా అవకాశాలను దక్కించుకోలేకపోయింది.కానీ ఎట్టకేలకు కన్నడలో స్టార్ హీరో అయిన దర్శన్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ ఈ చిత్రం కూడా ఫ్లాప్ అయింది.
దీంతో గత కొద్ది కాలంగా ఇషా చావ్లా సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటోంది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఇషా చావ్లా తెలుగు బిగ్ బాస్ 5వ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.కానీ ఇప్పటివరకు “ఇషా చావ్లా” మాత్రం ఈ విషయంపై స్పందించకపోవడంతో ఈ వార్తలు ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది.అయితే ఈ విషయం ఇలా ఉండగా తాజాగా ఇషా చావ్లా మళ్లీ తెలుగులో హీరోయిన్ గా “రీ ఎంట్రీ” ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ క్రమంలో ఆ మధ్య నెటిజన్ తన రీ ఎంట్రీ ఎప్పుడని అడగ్గా తొందర్లోనే మళ్లీ తాను హీరోయిన్ గా తెరపై కనిపిస్తానని అని రిప్లై ఇచ్చింది.