తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ తరువాత ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో రెండో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.
సాధ్యమైనంత వరకు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత పెంచేందుకు చాలా రకాలుగా ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.ఈ క్రమంలో కొన్ని చోట్ల బీజేపీ సఫలమైన పరిస్థితి ఉంది.
అయితే ప్రస్తుతం బీజేపీ పార్టీలో టీఆర్ఎస్ పట్ల అసంతృప్తి ఉన్న వారు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీని ఎంచుకుంటున్న దశలో బీజేపీలో చాలా వరకు కీలక నాయకులందరూ చేరుతున్న పరిస్థితి ఉంది.
ఈ క్రమంలో బీజేపీలో ఆధిపత్య పోరు మొదలైందనే ప్రచారం పెద్ద ఎత్తున మొదలైన పరిస్థితి ఉంది.
అంతేకాక త్వరలో తెలంగాణ బీజేపీ పార్టీ నాయకత్వం మారబోతోందనే వార్తలు పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది.అందుకు ప్రధాన కారణం బండి సంజయ్ అనే సరికొత్త వాదన తెరపైకి వచ్చింది.
అప్పటి వరకు ఫుల్ స్పీడ్ లో ఉన్న బీజేపీ… బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల తరువాత ఒక్కసారిగా అభాసుపాలు అయిన పరిస్థితి ఉంది.అంతేకాక కేసీఆర్ ను ఢీ కొనడంలో బీజేపీ పెద్ద ఎత్తున వెనుక బడుతున్న నేపథ్యంలో నాయకత్వ మార్పు చేస్తేనే ఎంతో కొంత బీజేపీకి లాభం ఉంటుందనేది మెజారిటీ బీజేపీ పార్టీ నాయకులు భావిస్తున్నారట.
లేకపోతే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బలమైన పోటీనిచ్చే పార్టీగా బీజేపీ ఎదగగలిగే అవకాశం లేదని బీజేపీ నేతలు అంతర్గతంగా భావిస్తున్నట్టు సమాచారం.మరి రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ లో నాయకత్వ మార్పు జరుగుతుందా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.