ప్రస్తుతం తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బలపడుతోంది.టీఆర్ఎస్ పై మాటల తూటాలతో టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తూ టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకతను పెంచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
అయితే కొంత మేర అంటే దుబ్బాకలో ఒక సీటు గెలవడం, గ్రేటర్ ఎన్నికల్లో బలం పెంచుకోవడంతో ఇక బీజేపీ నేతలు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న పరిస్థితి ఉంది.ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షాన్ని విమర్శించాలి.
తప్పులేదు.కాని అదే పనిగా అకారణంగా రోజు అదే పనిగా అసభ్య పదజాలంతో దూషిస్తూ పోతే కొన్ని రోజులకు బీజేపీ నేతల మాటలు పలుచనైపోతాయి.
అప్పుడు అవసరమైన సమయంలో మీ విమర్శలను పట్టించుకోవడం మానేసి టీఆర్ఎస్ పై, కేసీఆర్ పై సానుభూతి వ్యక్తమయ్యే అవకాశం ఉంది.అప్పుడు ఇప్పటిదాకా పన్నిన వ్యూహాలు అన్ని చెల్లాచెదురై మొదటికే మోసం వచ్చే విధంగా బీజేపీ తయారవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
అదే పనిగా విమర్శిస్తుంటే ప్రజలకు ఆయా నాయకుల మాటలను కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు.అప్పుడు ఆ నాయకుని మనుగడకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.
చూద్దాం ఇప్పటికైనా బీజేపీ నాయకులు ఈ విషయాన్ని గుర్తెరిగి సద్విమర్శలతో ప్రజల్లో మరింత బలంగా తయారవుతారని ఆశిద్దాం.