తెలంగాణ లో టీడీపీ పరిస్థితి చాలా వరకు ఆనవాళ్ళు లేకపోయిన పరిస్థితి ఉందనే విషయం మనకు తెలిసిందే.అయితే ఇప్పటివరకు తెలంగాణ కు వ్యతిరేకంగా ప్రవర్తించిన పార్టీగా తెలంగాణ ప్రజల్లో నిలిచిపోయిన విషయం మనకు తెలిసిందే.
అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం అదే విధంగా తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెడుతున్న సమయంలో చంద్రబాబు బిల్లును అడ్డుకోవడానికి యత్నించిన తీరు తెలంగాణ ప్రజల్లో గాయమైన పరిస్థితి ఉంది.అందుకే ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అత్యంత ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే.
ఆ యితే తెలంగాణ ఏర్పాటు తరువాత తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వారు టీడీపీని వీడినా ఎల్.రమణ మాత్రం టీడీపీలో ఇప్పటివరకు కొనసాగుతూ వస్తున్నాడు.
కాని తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని త్వరలో టీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.అయితే ఇక ఎల్.రమణ నిష్క్రమణతో తెలంగాణలో టీడీపీ మొత్తం ఖాళీ అయినట్లే కనిపిస్తోంది.
ఎందుకంటే మండలాల వారీగా అధ్యక్షులు కార్యవర్గం ఉన్నా సరైన సారథి లేకపోతే పార్టీ కొనసాగడం చాలా కష్టమైన విషయం.దీనిపై ఇప్పటికే చంద్రబాబు స్పందించకపోయినా తెలంగాణలో పార్టీ అనేది లేదు కాబట్టి ఎటువంటి చర్చలు కూడా కొనసాగించే అవకాశం లేదు.