ఏపీలో ఎన్నికలు ముగిసిపోయాయి ఫలితాలు ఎప్పుడెప్పుడా అంటూ తీవ్ర ఉత్ఖంటతో పార్టీల నేతలు, ప్రజలు ఎదురు చూపులు చూస్తున్నారు.మరో పక్క వైసీపీ పార్టీ తమదే అధికారం అనే ధీమా తో ఉంటూ టీడీపీ పై మాటల యుద్దమే చేస్తోంది.
ప్రతీ చోటా మాదే గెలుపు అంటూ లెక్కలు కూడా వేసుకుంటున్నారు వైసీపీ నేతలు.ఇక టీడీపీ నేతల్లో ఓటమి భయం సుస్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరులో టీడీపీ సైకిల్ స్పీడు అందుకుంటుందా లేక ఫ్యాన్ గాలి బలంగా వీస్తోందా అనే విషయంపై ఇంటిలిజెన్స్ రిపోర్ట్ అందిందట
ఈ విషయంపైనే సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసీపీ 8 స్థానాలు గెలుచుకోగా టీడీపీ 6 స్థానాలకే పరిమితం అయ్యింది.అయితే ఈ పరిస్థితి అప్పట్లో చంద్రబాబు కి మింగుడు పడలేదు.
ఎందుకంటే బాబు తన సొంత జిల్లాలోనే అధిక సీట్లు సాధించుకోలేక పోవడం ఘోరమైన అవమానమనే చెప్పాలి.ఇక తాజా సర్వే ప్రకారం చూస్తే టీడీపీ కి ఈసారి చిత్తు చిత్తు అవ్వడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి
ఈ సర్వే ప్రకారం చూస్తే ఈ జిల్లాలో వైసీపీ జోరు ఈసారి మాత్రం జెట్ స్పీడుతో దూసుకుపోవడం ఖాయమనే తేలిందట.
గతంలో కంటే కూడా ఈ సారి చిత్తూరు జిల్లాలో జగన్ 10 సీట్లని పక్కాగా గెలుచుకుంటారని తెలుస్తోంది.గతంలో 8 స్థానాలు వస్తే ఈ సారి వైసీపీ 10 గెలుచుకుని, టీడీపీ 4 స్థానాలకి పరిమితం కానుందని తెలుస్తోంది.
అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ వార్తల్లో ఎంత వరకూ నిజం ఉందొ లేదో తెలియదు కానీ మొత్తానికి చిత్తూరు జిల్లాలో వైసీపీ హవాకి టీడీపీ చిత్తు చిత్తే అంటున్నారు విశ్లేషకులు.