మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు రంగం సిద్ద అవుతోంది.ఇప్పటికే తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కత్తి’ని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్న విషయం తెల్సిందే.
వివి వినాయక్ ఆ చిత్రంకు దర్శకత్వం వహించబోతున్నాడు.భారీ అంచనాలున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మెగాస్టార్ రీఎంట్రీ చిత్రం బాక్సులు మరియు రికార్డులు బద్దలు అయ్యేలా ఉండాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.మెగా ఫ్యాన్స్ కోరుకున్నట్లుగానే వినాయక్ మరియు మెగా ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
చిరంజీవి ఈ రీఎంట్రీ చిత్రం 100 కోట్ల మార్క్ను క్రాస్ చేయాలని కోరుకుంటున్నారు.అది సాధ్యం అవ్వాలంటే చిరంజీవితో పాటు ఈ చిత్రంలో మరేదైనా అదనపు ఆకర్షణ ఉండాలని భావిస్తున్నారు.
అందుకే ఈ సినిమాలో సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ను నటింపజేయాలని దర్శకుడు వినాయక్ మరియు నిర్మాత రామ్ చరణ్లు భావిస్తున్నారు.ప్రస్తుతం రజినీకాంత్తో చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ వారు చిరంజీవి ఈ ప్రతిష్టాత్మక చిత్ర నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.
అందుకే చిరు మూవీలో గెస్ట్గా రజినీకాంత్ నటించడం ఖాయం అంటూ సినీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.