దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వెన్నంటే ఎప్పుడు ఓ నీడ కూడా తిరుగుతుండేది.వైయస్ ఎక్కడికెళ్లినా….
ఆ నీడ పక్కన ఉండాల్సిందే.ఆ నీడ పేరే సూర్యనారాయణ రెడ్డి .అలియాస్ సూరీడు ! రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన సూర్యుడికి రాజశేఖర్రెడ్డి తర్వాత ఆ స్థాయిలో పార్టీ నాయకుల్లో ఇమేజ్ ఉండేది.రాజశేఖర్ రెడ్డి ని ఎవరు కలవాలన్న ముందుగా సూరీడు అపాయింట్మెంట్ ఉండాల్సిందే.
ఆయన కూడా సూర్యుడికి అంతే స్థాయిలో ప్రాధాన్యత ఇస్తూ .ఉండేవారు.
అయితే రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి.సూరీడు ప్రస్తావన అప్పటి నుంచి పెద్దగా వినిపించలేదు.ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు ప్రచారం జరిగినా… ఆయన ఎక్కడ స్పందించినట్టు కనిపించలేదు.అప్పుడప్పుడు మీడియాలో కనిపించడం తప్ప పెద్దగా ఆయన ఉనికే లేదు.ప్రస్తుతం ఏపీలో ఎన్నికల స్టంట్ మొదలవడంతో… సూర్యుడు ప్రస్తావన మరోసారి వినిపిస్తోంది.వైఎస్ మరణాంతరం జగన్ కు ఆ కుటుంబానికి దగ్గరగా ఉండేందుకు ప్రయత్నించిన సూరీడు ఏమైందో ఏమో ఒక్కసారిగా ఎవరికీ కనిపించకుండా అజ్ఞాత జీవితాన్ని గడుపుతున్నాడు.
అయితే ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం మొదలైంది.సూర్యుడిని టిడిపిలోకి తీసుకొచ్చేందుకు మంత్రి ఆది నారాయణ రెడ్డి మధ్యవర్తిత్వం వహించారని … ఆయన సూచనతో సూర్యుడు టిడిపిలో చేరేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.కడప జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి సూర్యుడిని బరిలో దింపి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బ తీయాలని టిడిపి భావిస్తోంది.ఎందుకంటే …? రాజశేఖర్ రెడ్డికి అత్యంత నమ్మకస్తులైన సూరీడు ద్వారా వైసిపి మీద విమర్శలు చేస్తే రాజకీయంగా తమకు కలిసి వస్తుందని టిడిపి భావిస్తోంది.అయితే టీడీపీ లోకి ఆయన ఎప్పుడు వస్తాడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు.