టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంత ఫేమ్ సంపాదించుకున్న హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలియని వారుండరు.అయితే బన్నీ ఇటీవల కాలంలో నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బాగానే హిట్ అవుతున్నాయి.
దీంతో ప్రస్తుతం బన్ని వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు.అయితే తాజాగా అల్లు అర్జున్ కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టాడని పలు వార్తలు నెట్లో వైరల్ అవుతున్నాయి.
అయితే తాజాగా స్టైలిష్ స్టార్ బన్నీకి వ్యాపార రంగంలో బాగా సన్నిహితంగా ఉన్నటువంటి ఓ వ్యక్తి ఇటీవలే ఓ లగ్జరీ కార్ల కు సంబంధించిన వ్యాపారాన్ని మొదలు పెట్టాడట.అయితే ఇందులో ప్రముఖులు పలు కార్యక్రమాలకు ఉపయోగించేటటువంటి లగ్జరీ కార్లను అద్దెకు ఇస్తారట.
ఇందుకుగాను భారీ మొత్తంలోనే అద్దెలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యాపారం క్రమక్రమంగా బాగానే పుంజుకుంటోంది.
అందువల్ల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ వ్యాపారంలో తన మిత్రుడి సలహా మేరకు కొంత సొమ్ముని తన వాటాగా పెట్టుబడి పెట్టినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.అయితే ఈ వార్తలపై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అయితే ఇప్పటికే టాలీవుడ్ కి చెందిన పలువురు సినీ హీరోలు ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క వ్యాపార రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. అందువలన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో మాస్ యాంగిల్ లో కనిపించక నున్నాడు.
ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్వహిస్తోంది.ప్రస్తుతం ఈ చిత్రం కేరళ రాష్ట్రంలో షూటింగ్ జరగాల్సి ఉంది.
కానీ ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల ఈ చిత్ర షూటింగ్ ని కొంతకాలం పాటూ ఈ చిత్రీకరణని వాయిదా వేసినట్లు సమాచారం.