టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ శాకుంతంల సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందా లేదా అనే విషయం తెలియక ప్రేక్షకులు మీడియా వర్గాల వారు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అంతా కూడా జుట్టు పీక్కుంటున్నారు.పెద్ద ఎత్తున ఈ సినిమాను చిత్రీకరిస్తున్న దర్శకుడు గుణశేఖర్ ఇటీవలే అల్లు అర్హ షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యింది అంటూ కేక్ ను కట్ చేయించాడు.
ఆ తర్వాత సమంత పార్ట్ కూడా పూర్తి అయ్యింది అంటూ కేక్ కట్ చేయించారు.సమంత షూటింగ్ ను ముగించుకుని పాండిచేరికి వెళ్లి పోయింది.
అక్కడ విఘ్నేష్ శివన్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా లో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ మూవీలో నటిస్తోంది.
సమంత వెళ్లి పోయింది.
అర్హ షూటింగ్ కూడా పూర్తి అయ్యింది.కాని ఇప్పటి వరకు శాకుంతలం సినిమా షూటింగ్ అప్ డేట్ ను మాత్రం గుణశేఖర్ క్లారిటీ ఇవ్వలేదు.
ఇంతకు ఎప్పటి వరకు శాకుంతలం వస్తుంది అనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పడం లేదు.దిల్ రాజు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ను ఈ ఏడాదిలో విడుదల చేస్తారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
షూటింగ్ పూర్తి అయిన వెంటనే సాదారణంగా అయితే గుమ్మడి కాయ కొట్టి హడావుడి చేస్తారు.కాని గుణశేఖర్ మాత్రం ఇంకా ఏం చేస్తున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.పెద్ద ఎత్తున అంచనాలున్న శాకుంతలం సినిమా షూటింగ్ ను పూర్తి చేసినట్లుగా ప్రకటించినట్లయితే ఎప్పుడు విడుదల అనే ప్రశ్నలు వస్తాయి.అందుకే గుణశేఖర్ విడుదల తేదీ విషయంలో క్లారిటీ లేదు కనుక షూటింగ్ పూర్తి అయిన విషయాన్ని తెలియజేడం లేదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.