తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “ఫిదా” అనే చిత్రంలో తెలంగాణ యువతి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన “మలయాళ బ్యూటీ సాయి పల్లవి” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చీ రావడంతోనే మంచి హిట్ ని అందుకోవడంతో వరుస చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
కానీ గ్లామర్ తరహా పాత్రలకు కొంతమేర దూరంగా ఉండటంతో పలు స్టార్ హీరోల చిత్రాలలో నటించే అవకాశాన్ని కోల్పోయింది.
అయితే తాజాగా నటి సాయి పల్లవి గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే తమిళంలో మంచి విజయం సాధించిన “వేదాళం” చిత్రాన్ని తెలుగు రీమేక్ చిత్రంలో సాయి పల్లవి హీరో చెల్లెలి పాత్రలో నటిస్తున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలను తెగ హల్చల్ చేస్తున్నాయి. అంతేగాక ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
ఇప్పటికే ఈ చిత్ర రీమేక్ పనులను కూడా టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ దర్శకుడు సైలెంట్ గా కానిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.అయితే ఈ విషయం గురించి ఇటు సాయి పల్లవి నుంచి గాని అటు మెగాస్టార్ చిరంజీవి నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు దీంతో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నట్లు వస్తున్నటువంటి వార్తలలో నిజమెంతో అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి సాయి పల్లవి తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న “లవ్ స్టోరీ” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు పూర్తయ్యాయి.
కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో ఈ చిత్ర విడుదలను మరింత కాలం పాటు చిత్ర యూనిట్ సభ్యులు వాయిదా వేశారు.
అయితే మరోపక్క మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “ఆచార్య” చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
ఈ చిత్రానికి సంబంధించిన 65% శాతం చిత్రీకరణ పనులు పూర్తయినట్లు సమాచారం.