ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావడంతో సెలబ్రిటీల గురించి ఏదైనా ఓ వార్త బయటకి తెలిసిందంటే చాలు అందులో నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు వారి గురించి సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “ఫిదా” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన మలయాళ కుట్టి “సాయి పల్లవి” గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే తెలుగు, తమిళం, హిందీ, తదితర భాషలలో దాదాపుగా పదికి పైగా చిత్రాలకి దర్శకత్వం వహించిన ఓ ప్రముఖ దర్శకుడిని సాయి పల్లవి రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా పలు వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. అయితే సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతున్న ఆ ప్రముఖ దర్శకుడికి ఇంతకు ముందే పెళ్లయిందని అతడి మొదటి భార్య కూడా తెలుగులో హీరోయిన్ అని ప్రచారం జరుగుతోంది.
అలాగే సాయి పల్లవి ప్రముఖ దర్శకుడితో గతంలో కలిసి పనిచేసిందని ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు తన పెళ్లి విషయంపై వస్తున్నటువంటి ఈ వార్తల గురించి సాయి పల్లవి స్పందించలేదు.