తెలుగులో ప్రస్తుతం గీత గోవిందం చిత్ర ఫేమ్ దర్శకుడు పరశురామ్ “సర్కారు వారి పాట” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నాడు.
అలాగే మహేష్ బాబు కి జోడిగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి ఓ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ ఆ విషయం ఏమిటంటే ఈ చిత్రంలో మహేష్ బాబుకి వదిన పాత్రలో టాలీవుడ్ పవర్ స్టార్ మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య “రేణు దేశాయ్” నటిస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అంతేగాక ఇప్పటికే మహేష్ బాబు మరియు రేణు దేశాయ్ మధ్య వచ్చేటువంటి సన్నివేశాల చిత్రీకరణ కూడా మొదలైందని టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
కానీ ఇప్పటివరకు రేణు దేశాయ్ మహేష్ బాబు వదిన పాత్రలో నటిస్తున్నట్లు వినిపిస్తున్న వార్తలపై ఇటు రేణుదేశాయ్ గానీ అటు చిత్ర యూనిట్ సభ్యులు కానీ స్పందించడం లేదు. దీంతో ఈ వార్తలలో నిజం ఎంతుందనే విష్యం ఇంకా తెలియాల్సి ఉంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా గతంలో ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ మహేష్ బాబు చిత్రంలో నటించే అవకాశం వస్తే ఎలాంటి పాత్రలోనైనా నటిస్తానని తన మనసులో మాటను బయట పెట్టింది.దాంతో దర్శకుడు పరశురామ్ “సర్కారు వారి పాట” చిత్రంలో రేణు దేశాయ్ కి అవకాశం ఇచ్చినట్లు కొందరు ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.అయితే పెళ్లయిన తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయిన రేణు దేశాయ్ చాలా కాలం తర్వాత మళ్లీ మేకప్ వేసుకోబోతోంది. దీంతో ఈ చిత్రంలోని రేణు దేశాయ్ పాత్రపై ఆసక్తి నెలకొంది.