కేజిఎఫ్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే.ఈ సినిమాతో హీరో యష్ స్టార్ హీరోగా ఎదిగాడు.
అంతేకాదు యష్ ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిన విషయమే.
ఈ సినిమాతో చాలా మంది జీవితాలు మారిపోయాయి.ఈ సినిమా దర్శకుడు, హీరో, ఇందులో నటించిన నటీనటులు అందరూ స్టార్ స్టేటస్ అందుకున్నారు.ముఖ్యంగా యష్ ను అభిమానించే సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తుంది.ఈ సినిమాతో యష్ తన మార్కెట్ ను కూడా పెంచుకున్నాడు.
కేజీఎఫ్ సినిమాలో యష్ రాఖీ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజయ్యి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కేజీఎఫ్ చాప్టర్ 2 లో బాలీవుడ్ స్టార్లు సంజయ్ దత్, రవీనా టాండన్ నటిస్తున్నారు.
నిర్మాతలు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాను కేజీఎఫ్ కంటే ఊహించని స్థాయిలో తీర్చిదిద్దుతున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.
ఈ సినిమా రిలీజ్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదురు చూస్తున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.అది ఏంటంటే యష్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్టు వార్తలు జోరుగా వస్తున్నాయి.కానీ అసలు విషయం ఏంటంటే యష్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ కాలేదని తెలుస్తుంది.
కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ సమస్య వచ్చిందని సమాచారం.ఈ వార్త విని యష్ అభిమానులు ఊరట చెందారు.
ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేయకుండా ఉండడం మంచిదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.