గత కొంతకాలం నుంచి ఏ విధమైనటువంటి హిట్స్ లేక నిరాశతో ఉన్న రవితేజకి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన “క్రాక్” సినిమాతో అద్భుతమైన అవకాశాన్ని అందుకున్నారు.కరోనా తర్వాత థియేటర్లు తెరచుకోవడంతో ఈ సినిమా చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? అన్న అనుమానాల నడుమా ఈ సినిమా విడుదలయ్యి ఎన్నో సినిమాలకు ధైర్యం చెప్పింది.ఇలా క్రాక్ సినిమా ద్వారా అద్భుతమైన విజయాన్ని అందుకున్న రవితేజ ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే రవితేజ హీరోగా కోనేరు సత్యనారాయణ నిర్మాణంలో రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టువంటి చిత్రం “ఖిలాడి”.
ఇందులో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి గతంలో అప్డేట్స్ విడుదల అయినప్పటికీ గత కొంత కాలం నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి సమాచారం వినబడటం లేదు.
అందుకు గల కారణం ఏమిటనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అనుకున్న బడ్జెట్ కన్నా అధిక మొత్తంలో ఖర్చు కావడం చేత సినిమా నిర్మించడం కోసం బడ్జెట్ లేకపోవడంతో సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందనే సమాచారం చక్కర్లు కొడుతోంది.ఎవరైనా ఫైనాన్షియర్లు ముందుకు వస్తే తప్ప ఈ సినిమా షూటింగ్ పూర్తికాదనే గుసగుసలు వినపడుతున్నాయి.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
మరి ఈ సినిమా ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాల నుంచి బయటపడి ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.