ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుస సక్సెస్ లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు రష్మిక మందన్నా.ప్రస్తుతం రష్మిక చేతిలో తెలుగులో పుష్ప, ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాలు ఉండగా ఈ సినిమాలతో పాటు రష్మిక బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే రష్మిక బాలీవుడ్ ఎంట్రీ గురించి ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
మరో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా హిందీ సినిమాల్లో నటిస్తున్న పూజా హెగ్డే తెలుగు, హిందీ సినిమాలను బ్యాలెన్స్ చేస్తున్నారు.
కానీ రష్మిక మాత్రం బాలీవుడ్ లో వరుసగా సినిమాలకు కమిటవుతూ టాలీవుడ్ కు దూరమవుతుందా.? అనే సందేహం వ్యక్తమయ్యేలా చేస్తోంది.తెలుగులో నంబర్ 1 హీరోయిన్ గా గుర్తింపు వస్తున్న తరుణంలో రష్మిక బాలీవుడ్ కు వెళ్లి రాంగ్ స్టెప్ వేసిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో కొందరు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఇక్కడ అవకాశాలు వస్తున్నా బాలీవుడ్ కు వెళ్లి పెద్దగా సక్సెస్ కాలేకపోయారు.రష్మిక టాలీవుడ్ ఆఫర్లను వదులుకుని బాలీవుడ్ లో సక్సెస్ కాకపోతే మాత్రం ఆమె కెరీర్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.ప్రస్తుతం సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.
మరి రష్మిక హిందీలో సక్సెస్ అవుతారా.? లేదా.? తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీని స్టార్ హీరోయిన్ల కొరత వేధిస్తోంది.
ప్రస్తుతం స్టార్ హీరోలు తమ సినిమాల్లో పూజా హెగ్డే, రష్మికలకు ఎక్కువగా అవకాశాలను ఇస్తున్నారు.రష్మిక టాలీవుడ్ కు దూరమైతే మాత్రం పూజా హెగ్డేకు ఆఫర్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
తెలుగులో బిజీగా ఉన్న సమయంలో రష్మిక బాలీవుడ్ కు వెళ్లాలని తీసుకున్న నిర్ణయం రైటో రాంగో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.