టాలీవుడ్ ప్రముఖులను కరోనా భయపెడుతూనే ఉంది.కరోనా బారిన ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన పవన్ కళ్యాణ్, సోనూసూద్, కళ్యాణ్ దేవ్ ఇంకా ప్రముఖులు కూడా పడ్డారు.
టాలీవుడ్ లో దాదాపు అన్ని సినిమాలు కూడా కరోనా కారణంగా ఆగిపోయాయి.ఇటీవల చివరి షెడ్యూల్ ను రాధేశ్యామ్ యూనిట్ సభ్యులు మొదలు పెట్టిన విషయం తెల్సిందే.
రాధేశ్యామ్ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్న సమయంలో చిత్ర యూనిట్ సభ్యుల్లో కొందరికి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందట.దాంతో వెంటనే చిత్రం షూటింగ్ ను నిలిపి వేయడంతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా ఐసోలేషన్ కు వెళ్లారు అంటూ సమాచారం అందుతోంది.
ఇదే సమయంలో ప్రభాస్ కు కరోనా పాజిటివ్ అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.కాని ఇప్పటి వరకు అలాంటి అధికారిక ప్రకటన అయితే ఏమీ లేదు.
నిర్మాత ప్రమోద్ తో పాటు దర్శకుడు రాధాకృష్ణ లకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యిందని, అందుకే వారితో పాటు ప్రభాస్ కు కూడా కరోనా అంటూ వార్తలు వస్తున్నాయి.కాని ఇటీవల ఏ ఒక్కరు కరోనా బారిన పడ్డా కూడా వెంటనే తాము పాజిటివ్ తమతో కాంటాక్ట్ అయిన వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు.
ఏ ఒక్కరు కూడా కరోనా ను దాచుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనుక ప్రభాస్ కు కాని రాధాకృష్ణ కు కాని కరోనా సోకి ఉంటే వారు వెంటనే చెప్పే వారు.
వారి నుండి ఎలాంటి సోషల్ మీడియా ప్రకటన లేదు.కనుక ప్రభాస్ కు మరియు రాధేశ్యామ్ చిత్ర దర్శక నిర్మాతకు కరోనా అనే వార్తలు పూర్తిగా అవాస్తవం అయ్యి ఉంటుంది.
ఇలాంటి పుకార్లు పుట్టించి కొందరు సోషల్ మీడియాలో గందరగోళం కు గురి చేస్తున్నారు.ఫేక్ వార్తలను ఎక్కవ మంది నమ్మి షేర్ చేస్తున్న కారణంగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి.
ఇప్పుడు ప్రభాస్ కరోనా వార్త కూడా అలాగే వైరల్ అయ్యింది.సోషల్ మీడియాలో ఈ వార్త అలా వచ్చి ట్రెండ్ అయ్యి వెంటనే వెళ్లి పోయింది.స్టార్ కు కరోనా అంటూ నమ్మాలంటే మొదట వారి సోషల్ మీడియా వాల్ పైకి వెళ్లి పరిశీలిస్తే ఉత్తమం.