ఈమధ్య కాలంలో కొందరు నటీనటులు ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క వ్యాపారం మరియు రాజకీయాలు వంటి వాటిలో కూడా దిగి బాగానే రాణిస్తున్నారు.ఈ క్రమంలో ఇప్పటికే టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందినటువంటి పలువురు సినీ ప్రముఖులు అయిన మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మంచు మోహన్ బాబు, మహేష్ బాబు, తదితరులు ఇతర వాణిజ్య సంస్థలలో పెట్టుబడులు పెట్టి బాగానే రాణిస్తున్నారు.
ఈ క్రమంలో హీరోయిన్లు సైతం మేమేం తక్కువ కాదంటూ రియల్ఎస్టేట్ మరియు చదువుకు సంబంధించిన రంగాల్లో బాగానే రాణిస్తున్నారు.అయితే తాజాగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ హీరోయిన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
పలు తెలుగు చిత్రాలలో హీరోయిన్ గా నటించి తెలుగు సినీ ప్రేక్షకులను బాగానే అలరించిన హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే నటి పూనమ్ కౌర్ ఈ మధ్య తన వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలపై దృష్టి సారించ లేకపోతోంది.
కాగా తాజాగా నటి పూనమ్కౌర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది .అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే తొందర్లోనే ఈ అమ్మడు బిజెపి పార్టీలో చేరబోతోందని అందువల్ల ఇప్పటికే పలు రాజకీయ మెలకువలు నేర్చుకునేందుకు రాజనీతి శాస్త్రాన్ని చదువుకుంటోందని టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.అయితే ఇందుకు గల కారణాలు లేకపోలేదు.కాగా ఆ మధ్య పూనమ్ కౌర్ తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఓ ఫోటోని షేర్ చేస్తూ తాను ప్రస్తుతం పాలిటిక్స్ మరియు మేనేజ్మెంట్ సంబంధిత కోర్సులను చదువుతున్నట్లు పేర్కొంది.
దీంతో అందరూ తొందర్లోనే పూనమ్ కౌర్ రాజకీయాల్లోకి వస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కానీ ఇప్పటివరకు పూనమ్ కౌర్ మాత్రం తన రాజకీయ ఎంట్రీ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
అయితే ఈ విషయం ఇలా వుండగా ఈ మధ్య కాలంలో నటి పూనమ్ కౌర్ తాను నటించిన చిత్రాలతో కంటే ఎక్కువగా వివాదాలతోనే టాలీవుడ్ సినిమా పరిశ్రమలో పాపులర్ అవుతోంది.కాగా ఇటీవలే ప్రముఖ సినీ దర్శకుడు మరియు నటుడు పోసాని కృష్ణ మురళి పంజాబీ హీరోయిన్ వివాదం తెరపైకి తేవడంతో అందరూ పూనమ్ కౌర్ ని ఈ వివాదంలోకి లాగుతూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు.దాంతో ఆ మధ్య పూనమ్ కౌర్ ఈ విషయంపై స్పందిస్తూ కొందరు తమ స్వ లబ్ధి మరియు రాజకీయ లబ్ధి కోసం తనకు సంబంధం లేనటువంటి వివాదంలోకి లాగుతున్నారని ఘాటుగా కామెంట్లు చేసింది.