ప్రస్తుతం టాలీవుడ్ లో గ్లామర్ క్వీన్ పూజా హెగ్డే వర్ష అవకాశాలను అందిపుచ్చుకుంటూ అలాగే వాటిని సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతోంది.అయితే తాజాగా ఈ అమ్మడు నటించిన టువంటి చిత్రం అల వైకుంఠపురములో.
ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా అల్లు అర్జున్ ప్రధాన కథానాయకుడిగా నటించాడు.ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో బిజీ షెడ్యూల్ తో బిజీబిజీగా గడుపుతోంది.
అయితే తాజాగా పూజ హెగ్డే గురించి ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
అయితే ఆ విషయం ఏంటంటే ఓ సీనియర్ స్టార్ హీరో కొడుకుతో గత కొద్ది కాలంగా ఈ అమ్మడు డేటింగ్ చేస్తూ ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందులో భాగంగా పూజా హెగ్డే ఏ టూర్ వెళ్ళినా అతగాడితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోందట.అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ పూజా హెగ్డే ఎప్పుడూ తన అభిమానులతో సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటుంది.
కానీ ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా అతనికి సంబంధించిన ఫోటోలను తన అభిమానులతో షేర్ చేసుకోకపోవడంతో ఇవన్నీ గాలి వార్తలే అని కొట్టి పారేస్తున్నారు కొందరు.అయితే మరికొందరు మాత్రం తన వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తిగతంగా ఉంచుకునేందుకు పూజా హెగ్డే తన బాయ్ ఫ్రెండ్ కి సంబంధించిన వివరాలను బయట పెట్టడం లేదని అంటున్నారు.
ఈ విషయాలపై హెగ్డే క్లారిటీ ఇచ్చేంతవరకు ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలియరావడం లేదు.
అయితే ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న అటువంటి జాన్ చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె.కె రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.అలాగే అక్కినేని అఖిల్ సరసన కూడా నటిస్తోంది.