టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల కాలం పాటు విరామం తీసుకొని మళ్ళీ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు.
ఇప్పటికే పవన్ ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న “వకీల్ సాబ్” అనే చిత్రంలో నటిస్తున్నాడు.అయితే ఈ చిత్రం ఇప్పటికే దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మరో కొత్త చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.అయితే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.
అయితే ఇప్పటికే పూరి జగన్నాథ్ ఈ కథకు సంబంధించి నటువంటి పూర్తి స్క్రిప్ట్ ని పవన్ కళ్యాణ్ కి వినిపించగా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.అయితే ఈ కథ మొత్తం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ కీలక పరిణామాలను బట్టి ఉంటుందని ఎలాగో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో మార్పు కోరుకుంటుండడంతో ఈ చిత్రం ద్వారా ప్రయోగాన్ని చేయాలనుకుంటున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా గతంలో పూరి జగన్నాథ్ మరియు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చినటువంటి కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఈ చిత్రం కూడా అప్పట్లో రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పరిస్థితులను ఆధారంగానే తెరకెక్కించారు.కానీ ఈ చిత్రం పెద్దగా విజయం సాధించలేకపోయింది.దీంతో పలువురు సినీ విశ్లేషకులు మరోసారి రాజకీయ కథాంశానికి ఓకే చెప్పే ముందు ఒకసారి పవన్ కళ్యాణ్ ని ఆలోచించుకోవాలని ఇస్తున్నారు.