నటుడిగా పలు సినిమా ల్లో నటించిన బండ్ల గణేష్ అనూహ్యంగా నిర్మాతగా మారాడు.పవన్ కళ్యాణ్ తో పాటు మెగా కాంపౌండ్ సాయంతో బండ్ల గణేష్ నిర్మాతగా మారాడు.
వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేసిన బండ్ల గణేష్ చివరగా చరణ్ తో చేసిన గోవిందుడు అందరి వాడేలే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కాని ఆ సినిమా నిరాశ పర్చింది.
ఆర్థికంగా నష్టపర్చిన ఆ సినిమా తో బండ్ల గణేష్ మళ్లీ పుంజుకోలేక పోయాడు.నాలుగు అయిదు ఏళ్ల తర్వాత మళ్లీ నిర్మాతగా ఒక సినిమా చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.
అది కూడా పవన్ కళ్యాణ్ తో అవ్వడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు.నా దేవుడితో మళ్లీ సినిమా చేయబోతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.
దాంతో అప్పటి నుండి అదుగో బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ సినిమా అంటూ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.ఎంతో మంది దర్శకులతో బండ్ల గణేష్ సంప్రదించాడంటూ వార్తలు వచ్చాయి.
మొన్నటికి మొన్న ఖిలాడీ దర్శకుడితో సినిమా అంటూ వార్తలు వచ్చాయి.రమేష్ వర్మ, పవన్ కళ్యాణ్ ల కాంబోలో రూపొందుతున్న సినిమాలకు సంబంధించిన ప్రకటన రాబోతుంది అంటూ వార్తలు రాగా వాటిని బండ్ల గణేష్ కొట్టి పారేశాడు.
అలాంటి చర్చలు ఏమీ జరగలేదు అంటూ తేల్చి చెప్పాడు.అంతకు ముందు కూడా వచ్చిన పుకార్లకు చెక్ పెట్టాడు.సినిమా ను చేయబోతున్నట్లుగా ఏడాది క్రితం ప్రకటించిన బండ్ల గణేష్ ఇప్పటి వరకు కనీసం సినిమా కు ఎవరు దర్శకుడు అనే విషయాన్ని కూడా చెప్పలేదు.దాంతో అసలు పవన్ తో సినిమా ఉందా లేదా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరో సారి పవన్ తో సినిమా విషయమై బండ్ల గణేష్ స్పష్టంగా చెప్పాలంటూ కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.