మెగా వారి ఇంట పెళ్లి సందడి మొదలు అయ్యింది.నాగబాబు కూతురు నిహారిక పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు ఒకటి రెండు రోజుల్లో మొత్తం ఫ్యామిలీ ఉదయ్ పూర్ ప్యాలెస్ కు వెళ్లబోతున్నారు.
ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.నిహారిక వివాహ నిశ్చితార్థంకు పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు.
ఆ సమయంలో దీక్షలో ఉన్న కారణంగా పవన్ రాలేదు అంటూ వార్తలు వచ్చాయి.అయితే ఇప్పుడు అయినా పవన్ వస్తాడా అనేది చర్చనీయాంశంగా మారింది.
పవన్ ప్రస్తుతం రైతులను పరామర్శించేందుకు కృష్ణ మరియు గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తున్నారు.నివార్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతుల కోసం పవన్ అక్కడ ఉన్నాడు.
పెళ్లికి మరో ఆరు రోజుల సమయం ఉంది కనుక పవన్ పెళ్లికి హాజరు అవుతాడనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నిహారిక స్వయంగా కలిసి బాబాయి పవన్ ను ఆహ్వానించింది.పెళ్లికి తప్పకుండా రావాలంటూ విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది.కేవలం పవన్ మాత్రమే కాకుండా ఆయన పిల్లలు మొత్తం కూడా ఈ పెళ్లికి కూడా హాజరు అవుతారు అంటూ మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
రేణు దేశాయ్ ని కూడా పెళ్లికి ఆహ్వానించారనే వార్తలు వస్తున్నాయి.నిహారిక అంటే మెగా ఫ్యామిలీలో ప్రత్యేకమైన అభిమానం అనడంలో సందేహం లేదు.అందుకే అందరు కూడా నిహారిక పెళ్లికి హాజరు అవుతారు అనిపిస్తుంది.మరి పవన్ విషయంలో మాత్రం మెగా ఫ్యామిలీ నుండి స్పష్టత లేదు.
చిరంజీవితో పాటు అల్లు ఫ్యామిలీ మొత్తం కూడా ఉదయ్ పూర్ కు రెండు రోజుల ముందు చేరుకోబోతున్నారు.ఇటీవలే నాగబాబు కూడా పవన్ తో స్వయంగా మాట్లాడి నిహారిక పెళ్లికి రావాల్సిందే అన్నట్లుగా చెప్పాడట.
మరి అన్న ఇంట పెళ్లికి పవన్ హాజరు అయ్యేనా చూడాలి.