ఒకప్పుడు బుల్లితెర మీద పాపులర్ షో అయిన జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరుగా అందరు బయటకు వచ్చేయడంతో ఆ షో మీద ఆడియెన్స్ ఆసక్తి కూడా తగ్గిపోతుంది.ముందు నాగబాబు బయటకు రాగా ఆయనతో కొంతమంది కమెడియన్స్ బయటకు వచ్చారు.
ఆ తర్వాత రోజా కూడా మినిస్టర్ అయ్యాక జబర్దస్త్ మానేసింది.ఇక లేటెస్ట్ గా హాట్ యాంకర్ అనసూయ కూడా షోని వదిలేస్తున్నా అని మెసేజ్ పెట్టింది.
అనసూయకి ఇప్పుడున్న క్రేజ్ కి జబర్దస్త్ ప్రధాన కారణమని చెప్పొచ్చు.
కానీ కెరియర్ లో ముందుకెళ్లాలి అంటే ఒకచోటే ఆగిపోకూడదు.అందుకే మంచి ఛాన్స్ వస్తే తప్పకుండా వదిలిపెట్టాలి.ఈ క్రమంలో అనసూయ కూడా జబర్దస్త్ యాంకర్ సీట్ ని ఖాళీ చేసింది.అయితే ఆల్రెడీ ఎక్స్ ట్రా జబర్దస్త్ లో రష్మి యాంకర్ గా కొనసాగుతుంది.ఆమెతోనే జబర్దస్త్ కూడా యాంకరింగ్ చేసే ఛాన్స్ ఉంది.
కానీ లేటెస్ట్ గా అనసూయ ప్లేస్ లో జబర్దస్త్ యాంకర్ గా ఓ యాంకర్ పేరు గట్టిగా వినిపిస్తుంది.ఆమె ఎవరో కాదు యాంకర్ మంజూషా.
సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ చేస్తూ పాపులర్ అయిన మంజూషా కూడా ఇప్పటి యాంకర్ ఏమి కాదు.దాదాపు ఆమె చాలా ఏళ్లుగా యాంకరింగ్ చేస్తూ వస్తుంది.
అందుకే అనసూయ ప్లేస్ లో మంజూషా అయితే పర్ఫెక్ట్ అని మల్లెమాల టీం భావిస్తుంది.జబర్దస్త్ యాంకర్ గా మంజూషాకి మంచి రెమ్యునరేష ఆఫర్ చేశారట.
అనసూయ లానే యాంకర్ గా హాట్ లుక్స్ తో అదరగొడుతుంది మంజూషా అందుకే ఆమె ముందుకు ఈ ఆఫర్ వచ్చింది.
మరి జబర్దస్త్ ఆఫర్ ని మంజూషా ఓకే చెబుతున్నా లేదా అన్నది చూడాలి.మంజూషా ఓకే అంటే మాత్రం ఆమె కెరియర్ కి ఇదొక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.జబర్దస్త్ వల్ల ఎంతోమంది కెరియర్ లు సెట్ రైట్ అయ్యాయి.
ఈ క్రమంలో మంజూషా కెరియర్ కూడా స్టార్ రేంజ్ లో వెలిగిపోవాలని అనుకుంటుంది.