నారా లోకేష్ సామర్థ్యంపై టీడీపీ నేతలు, సీనియర్లలోనే చాలా మందికి నమ్మకం లేదన్నది వాస్తవం.చంద్రబాబు చూస్తే ముసలి వాడు అయిపోయాడు.
ఇప్పటికే వయోః భారంతో ఉన్న చంద్రబాబు వచ్చే ఎన్నికల వరకు యాక్టివ్గా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అది సాధ్యమవుతుందా ? అన్నది డౌటే.లోకేష్ గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయాక పార్టీ నేతల్లోనూ, ఇటు గెలిచిన వారిలోనూ చాలా మందికి లైట్ అయిపోయాడు.
ఎమ్మెల్సీ అయిన రెండు రోజులకే కేబినెట్ పదవి సొంతం చేసుకున్న లోకేష్ గత ఎన్నికల్లో మంత్రిగా ఉండి ఓడిపోయారు.
ఇక పార్టీలో కొందరు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసినా లోకేష్ మాత్రం ఎమ్మెల్సీ పదవి వదులుకు నేందుకు కూడా ఇష్టపడలేదు.
ఇప్పుడు బయటి వాళ్లే కాదు.నారా లోకేష్ ను సొంత మనుషులు కూడా లైట్ తీసుకుంటున్నారా ? అంటే ఔననే సమాధానం వస్తోంది టీడీపీ నేతల దగ్గర నుంచి.లోకేష్ను చివరకు ఆయన సొంత మామ అయిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా పట్టించు కోవడం లేదని తెలుస్తోంది.పార్టీలో ముప్ఫై మందిలో ఒకడిగా ఉండడం ఇష్టం లేదని చెప్పిన బాలకృష్ణ తనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వమని బాబును కోరినా బాబు, లోకేష్ ఇద్దరూ పట్టించుకోలేదని టాక్ ?
అప్పటి నుంచి బాలయ్య వారితో కాస్త అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నారట.ఈ అసహనంతోనే బాలయ్య పొలిట్ బ్యూరో సమావేశం దగ్గర నుంచి రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశానికి కూడా డుమ్మాకొట్టారు.అయితే సడెన్గా షాక్ ఇస్తూ తన సొంత నియోజకవర్గం అయిన హిందూపురంలో బుధవారం నుంచి జరిగే మూడు రోజుల కార్యక్రమాల్లో మాత్రం పాల్గొంటున్నారు.
అంటే పొలిట్ బ్యూరోతో పాటు రాష్ట్ర స్థాయి సమావేశాలకు డుమ్మా కొట్టిన బాలయ్య సొంత నియోజకవర్గంలో మూడు రోజుల పాటు పర్యటిస్తున్నారు. లేపాక్షిలో రైతులతో ముఖాముఖి సమావేశం కానున్నారు.
దీనిని బట్టి బాలయ్య ఉద్దేశం ఏంటో చెప్పకనే చెప్పేశాడు.మరి బాలయ్య పార్టీలో ఇంకెంత హీట్ పుట్టిస్తాడో ? చూడాలి.