టాలీవుడ్ లోకి వచ్చి రావడంతోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో జత కట్టి తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన టువంటి కియారా అద్వానీ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు.అయితే తెలుగులో ఇటీవల కాలంలో రామ్ చరణ్ తో వినయ విధేయ రామ చిత్రంలో నటించింది.
ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు.అయితే ఈచిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.
కానీ కలెక్షన్ల పరంగా మాత్రం మంచి వసూళ్లు సాధించింది.
అయితే ప్రస్తుతం అద్వానీ టాలీవుడ్ లో మరో మంచి ఆఫర్ ని దక్కించుకుంది.
భరత్ అనే నేను చిత్రంలో మహేష్ సరసన ఆడి పాడిన టువంటి ఈ ముద్దుగుమ్మ మళ్లీ ఇంకోసారి మహేష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.అయితే ఈ చిత్రానికి వినూత్న దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే తెలుగులో దాదాపుగా నటించిన ఇప్పటివరకు స్టార్ హీరోల సరసన మాత్రమే నటించింది.అందువల్లనే మరో స్టార్ హీరో కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే ఇది ఇలా ఉండగా ఈ అమ్మడు తాజాగా నటించిన టువంటి కబీర్ సింగ్ చిత్రం మంచి హిట్ అయ్యి కియరా అద్వానీ సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.అలాగే ప్రస్తుతం కియారా అద్వాని, ఇండో కి జవాని, షేర్షా, భూల్ భులియాజ్ 2 వంటి చిత్రాల్లో నటిస్తోంది.