కేజిఎఫ్ సిరీస్ తో యష్ పాన్ ఇండియా వ్యాప్తంగా పేరు సంపాదించు కున్నాడు.ఈ సినిమాలకు ముందు కేవలం కన్నడ ఇండస్ట్రీ లో మాములు హీరోగా రాణించే వాడు.
అయితే ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజిఎఫ్ రెండు పార్టులు కూడా ఘన విజయం సాధించి కలెక్షన్స్ పరంగా కూడా రికార్డులను తిరగ రాసింది.అయితే కేజిఎఫ్ సిరీస్ తర్వాత ఈయన మరో సినిమా చేయలేదు.
నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడా అని ఈయన ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నారు.అయితే కేజిఎఫ్ సిరీస్ కు కొనసాగింపుగా.కేజిఎఫ్ 3 ఉంటుంది అని త్వరలో కేజిఎఫ్ 3ను కూడా నీల్ తెరకెక్కించ బోతున్నట్టు తెలుస్తుంది.మరి ఇది సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుందో చూడాలి.
ప్రెజెంట్ అయితే ప్రశాంత్ నీల్ సలార్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.
ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగి పోయాయి.సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు.అయితే ఈ సినిమా గురించి ఇప్పుడొక ఆసక్తికర చర్చ స్టార్ట్ అయ్యింది.
ఈ సినిమాలో యష్ కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది.ఇదే కనుక నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ తో యష్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూడడం ఖాయం.
చూడాలి ఈ రూమర్ లో ఎలాంటి నిజం ఉందో.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.కెజిఎఫ్ వంటి సినిమాను నిర్మించిన హోంబలే వారు భారీ స్థాయిలో 300 కోట్ల బిజినెస్ తో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక డార్లింగ్ ఈ సినిమాతో పాటు ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ వంటి సినిమాలను చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.