కేసీఆర్ను మించిన వ్యూహ కర్త తెలంగాణలో లేరేమో అనిపిస్తుంది కొన్ని సార్లు.ఎందుకంటే ఆయన తనకు అనుకూలం అనుకుంటే ఎవరితో అయినా కలిసి పోగలరు.
ప్రమాదం అనుకుంటే ఎంతటి వారిని అయినా పాతాళానికి తొక్కేయగల దిట్ట.అందుకే ఆయన మాటల మాంత్రికుడిగా కొనసాగుతున్నారు.
ఇకపోతే ఇప్పుడు బీజేపీతో సై అంటే సై అన్నట్టు రాజకీయాలు చేస్తున్నారు.మొన్నటికి మొన్న రెండు రోజులు ప్రెస్ మీట్ పెట్టి ఏకిపారేసిన కేసీఆర్ 12న ధర్నాలు కూడా చేశారు.
వడ్ల కొనుగోలు మీద పెద్ద యుద్ధమే చేస్తున్నారు.
ఇప్పుడు మరో యుద్ధానికి తెరలేపారు సీఎం కేసీఆర్.18వ తేదీన మరోసారి ధర్నా చేసేందుకు రెడీ అయిపోతున్నారు.మొన్న పోయిన సారి మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే ధర్నాలు చేస్తే ఈ సారి స్వయంగా కేసీఆర్ పాల్గొనబోతున్నారు.
ఒక సీఎంగా ఉండి ఆయన ధర్నా చేయడం ఇదే మొదటిసారి.ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ కోసం కూడా ఏనాడూ కేసీఆర్ ధర్నా చౌక్ దగ్గర నిరసన చేయలేదు.
కానీ మొదటిసారి అది కూడా సీఎంగా ఉండి మరీ ధర్నా చౌక్కు వస్తున్నారు.ఒకప్పుడు ధర్నా చౌక్ వద్దని దాన్ని ఎత్తేసిన కేసీఆరే ఇప్పుడు అందులో ధర్నాచేయబోతున్నారు.
ఈ ధర్నాలో కేసీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనబోతున్నారు.అంటే దీన్ని బట్టి కేసీఆర్ బీజేపీ మీద ఏ స్థాయిలో ఫైర్ మీద ఉన్నారో అర్థం అవుతోంది.ఇప్పుడు హుజూరాబాద్ తర్వాత తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిపోతుందని అలెర్ట్ అయిన కేసీఆర్ ఎలాగైనా రైతుల్లో బీజేపీ మీద వ్యతిరేకత తీసుకొచ్చేందుకు ప్లాన్ వేశారు.
మొక్కగా ఉన్నప్పుడే తుంచేస్తే రాబోయే ప్రమాదం తప్పుతుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారు.ఇప్పటి నుంచే రాబోయే ఎన్నికల్లో తనకు తిరుగు లేకుండా చూసుకుంటున్నారు.