తెలుగులో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానల్ అయినటువంటి ఈ టీవీలో ప్రతి బుధవారం రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారమయ్యే “ఢీ” జోడి డ్యాన్స్షో కంటెస్టెంట్ తమ డాన్సులతో అదరగొడుతుంటే సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ గౌతమ్, యాంకర్ వర్షిని హైపర్ ఆది తదితరులు తమ కామెడీతో ఈ షోకి మరింత వన్నె తెస్తున్నారు.అయితే ఈ ఢీ షోలో టీమ్ లీడర్స్గా పాల్గొంటున్న రష్మి గౌతమ్ మరియు సుధీర్ బుల్లితెర మీద బాగానే పాపులర్ అయ్యారు.అంతేగాక రష్మి గౌతమ్ హీరోయిన్గా పలు అవకాశాలను దక్కించుకోగా సుడిగాలి సుదీర్ బుల్లితెర పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకొని ఏకంగా సినిమా హీరోగా ఛాన్స్ కూడా దక్కించుకున్నాడు.
అయితే తాజాగా ఈ మధ్యకాలంలో ఢీ జోడి టీం లీడర్ గా పాల్గొంటున్న వర్షిని మరియు హైపర్ ఆది మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అవుతోంది.దీంతో తాజాగా వీరిద్దరూ ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న “ఆలీతో సరదాగా” అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.
అయితే ఈ షో లో హైపర్ ఆది వర్షిణి గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.ఇందులో భాగంగా తాము కేవలం స్క్రీన్ మీద ప్రేక్షకుల ఆనందం కోసమే అలా నటిస్తామని అంతే తప్పా తమ మధ్య అలాంటిదేమీ లేదని స్పష్టం చేశాడు.
అయితే వీరిద్దరి మధ్య ప్రేమ గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే వచ్చే మంగళవారం వరకు వేచి ఉండాల్సిందే
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తెలుగులో యాంకర్ వర్షిణి పలు రకాల ఈవెంట్లు, షోలు ఇవెంట్లలో వ్యాఖ్యత గా నటిస్తూ బాగానే రాణిస్తోంది.అంతేగాక ఇటీవలే తెలుగు చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశం కూడా దక్కించుకున్నట్లు సమాచారం.
ఇక హైపర్ ఆది కూడా జబర్దస్త్ షో లో తన కామెడీ స్కిట్లతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాడు.మరోపక్క పలు చిత్రాలలో కూడా కమెడియన్గా నటించే అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణిస్తున్నాడు.