‘ఉక్కు మనిషి’, ఈ దేశ సమైక్యత, సమగ్రతల కోసం అలుపెరగకుండా శ్రమించిన స్వాతంత్య్ర సమరయోధుడు, స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభభాయ్ పటేల్ అతి ఎత్తయిన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జాతికి అంకితం చేశారు.నర్మదా నదీతీరాన సర్దార్ సరోవర్ డ్యాం సమీపాన ఈ భారీ విగ్రహం కోసం 3,400మంది కార్మికులు నలభై రెండు నెలలుగా రాత్రింబగళ్లు శ్రమించారు.
అయితే ఈ ఐక్యత విగ్రహం నిర్మాణానికి అయిన ఖర్చు 3000 కోట్లు.విగ్రహం ఆవిష్కరించిన నేపథ్యంలో కొంతమంది నెటిజెన్లు 3000 కోట్లు ఎందుకు వృధా చేస్తున్నారు.లేనివారికి సహాయం చేయొచ్చు కదా అని విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఇది మన ఆలోచన విధానం బట్టి ఉంటుంది.కొంచెం పాజిటివ్ గా ఆలోచిస్తే.
3400 కార్మికులకు పని దొరికింది.వారి కుటుంబాల కడుపు నిండింది.అలాగే పరోక్షంగా ఈ విగ్రహం కి కావాల్సిన ఉక్కు, సిమెంట్ సప్లై చేసిన కంపెనీలు, అందులో పని చేసే కార్మికులకు ఉపాధి దొరికింది.
ముఖ్యంగా ఈ విగ్రహం వల్ల టూరిజం పెరుగుతుంది.విదేశీయులు కూడా సందర్శిస్తారు.రవాణా సదుపాయాలు పెరుగుతాయి.విగ్రహం కింద ఉన్న మ్యూసియం వల్ల కొంతమందికి ఉపాధి దొరికింది.
ఫ్రీ గా లేని వారికి సహాయం చేయడం కంటే ఇంతమందికి పని కల్పించి దేశ రెవెన్యూ పెంచడం బెటర్ కదా.?
.